Budget 2023: మార్కెట్ మూడ్.. గత12 బడ్జెట్లకు సూచీల స్పందన ఇలా..!
ఈ సారి బడ్జెట్ మార్కెట్లను దిశను నిర్ణయించనుంది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోతలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రానున్న ఈ బడ్జెట్పై మదుపర్ల అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో బడ్జెట్ రోజుల్లోనే మార్కెట్లు తమ స్పందనను తెలియజేశాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకొందాం..
ఇంటర్నెట్డెస్క్: బడ్జెట్ నాడు మార్కెట్ పల్స్ పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టిన రోజు ఒక రకంగా స్పందించిన మార్కెట్లు.. కొద్ది రోజుల్లోనే పూర్తి భిన్నమైన దిశగా పయనించాయి. గత పదేళ్లలో తాత్కాలిక బడ్జెట్లతో సహా మొత్తం నలుగురు ఆర్థిక మంత్రులు 12 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటిల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే మార్కెట్ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ఆ రోజుల్లో మార్కెట్లు చాలా తీవ్రమైన కుదుపులకు గురయ్యాయి. ఒక సందర్భంలో మార్కెట్ సూచీ నిఫ్టీ ఏకంగా 2.5శాతం నష్టపోగా.. మరోసారి ఏకంగా 4.7శాతం లాభపడింది. ఈ స్థాయి కుదుపుల్లో చిన్న మదుపర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. నెల రోజుల తర్వాత కూడా ఆరు సందర్భాల్లో నిఫ్టీ ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగింది. అందుకే గత పదేళ్లుగా బడ్జెట్ల సమయంలో మార్కెట్లు ఎలా స్పందించాయో చూద్దాం.
*2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ, ఇది దలాల్ స్ట్రీట్ను ఏమాత్రం ఆకర్షించలేదు. దీంతో నిఫ్టీ ఏకంగా 2శాతం విలువ కోల్పోయింది. దాదాపు నెల రోజుల తర్వాత కూడా 0.2 నష్టాల్లో కొనసాగింది. 2009 బడ్జెట్ తర్వాత మార్కెట్ ఈ స్థాయి నష్టాలను చవిచూసింది. 2014లో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ను ఆకర్షించింది.
* 2014లో మోదీ సర్కారు తొలిసారి అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి జులై 10న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ మదుపర్లను స్వల్పంగా నిరాశపరిచింది. దీంతో నిఫ్టీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. కానీ, నెల రోజుల తర్వాత సూచీ 0.8శాతం లాభాల్లోకి వెళ్లింది.
* 2015లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తొలి రోజు మార్కెట్ను సంతోషపెట్టినా.. ఆ తర్వాత నష్టాల్లో ముంచేసింది. బడ్జెట్ రోజు నిఫ్టీ 0.7శాతం లాభపడింది. ఇక నెల తర్వాత భారీగా పతనమైంది. 4.6శాతం విలువ కోల్పోయింది.
* 2016లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ను తాత్కాలికంగా నిరాశకు గురిచేసింది. 0.6శాతం విలువ పతనం అయింది. కానీ, ఆ తర్వాత నుంచి మార్కెట్ భారీ లాభాల్లో పయనించింది. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 10.7శాతం లాభపడింది.
* 2017లో భారత్ చాలా కొత్త సంప్రదాయాలను ప్రారంభించింది. రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం మానేసింది. అంతేకాదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ సారి బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్లో భారీ ర్యాలీకి దారితీసి నిఫ్టీ 1.8శాతం లాభపడింది. 2011-20 మధ్యలో అతిపెద్ద బడ్జెట్ ర్యాలీ ఈ సంవత్సరం చోటు చేసుకొంది.
* కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లి తుది బడ్జెట్ను 2018లో సమర్పించారు. జీఎస్టీని తొలిసారి ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లోనే. ఈ బడ్జెట్ దలాల్ స్ట్రీట్ను ఏమాత్రం ఆకర్షించలేదు. సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 6శాతం విలువ కోల్పోయింది. 2011-21 మధ్యలో ఒక నెలరోజుల్లో నిఫ్టీ చవి చూసిన రెండో అతిపెద్ద పతనం ఇది. 2019లో ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మదుపర్లను ఆకర్షించింది. దీంతో నిఫ్టీ 0.6శాతం లాభపడింది.
* మోదీ 2.0 సర్కారులో నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కూడా మదుపరులను ఆకర్షించలేదు. పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లోని చాలా ప్రధాన విషయాల్లో నిర్మల సీతారామన్ స్పష్టత ఇవ్వలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నిఫ్టీ 1.1శాతం నష్టపోయింది. ఆ తర్వాత నెల రోజుల్లో 8శాతం విలువ కోల్పోయింది. 2011-21 మధ్యలో ఈ స్థాయిలో సూచీలు ఎప్పుడూ పతనం కాలేదు.
* 2020లో బడ్జెట్ కూడా మదుపర్ల అంచనాను చేరుకోలేదు. దీంతో అదే రోజు 2.5 శాతం పతనమైంది.
* 2021 బడ్జెట్కి దలాల్ స్ట్రీట్ ఉరకలు వేసింది. మార్కెట్ ఏకంగా 4.7శాతం లాభపడింది. 1999 తర్వాత మార్కెట్ బడ్జెట్ రోజు ఈ స్థాయిలో లాభపడటం ఇదే.
* ఇక 2022లో మార్కెట్లు బడ్జెట్ రోజు సానుకూలంగానే స్పందించింది. 1.4శాతం నిఫ్టీ పెరిగినా.. ఆ తర్వాత మెల్లగా సూచీ పతనమైంది. నెలరోజులు తిరిగేసరికి నిఫ్టీ 4.5శాతం నష్టాలను మూటగట్టుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత