Budget 2023: మార్కెట్ మూడ్.. గత12 బడ్జెట్లకు సూచీల స్పందన ఇలా..!
ఈ సారి బడ్జెట్ మార్కెట్లను దిశను నిర్ణయించనుంది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోతలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రానున్న ఈ బడ్జెట్పై మదుపర్ల అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో బడ్జెట్ రోజుల్లోనే మార్కెట్లు తమ స్పందనను తెలియజేశాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకొందాం..
ఇంటర్నెట్డెస్క్: బడ్జెట్ నాడు మార్కెట్ పల్స్ పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టిన రోజు ఒక రకంగా స్పందించిన మార్కెట్లు.. కొద్ది రోజుల్లోనే పూర్తి భిన్నమైన దిశగా పయనించాయి. గత పదేళ్లలో తాత్కాలిక బడ్జెట్లతో సహా మొత్తం నలుగురు ఆర్థిక మంత్రులు 12 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటిల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే మార్కెట్ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ఆ రోజుల్లో మార్కెట్లు చాలా తీవ్రమైన కుదుపులకు గురయ్యాయి. ఒక సందర్భంలో మార్కెట్ సూచీ నిఫ్టీ ఏకంగా 2.5శాతం నష్టపోగా.. మరోసారి ఏకంగా 4.7శాతం లాభపడింది. ఈ స్థాయి కుదుపుల్లో చిన్న మదుపర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. నెల రోజుల తర్వాత కూడా ఆరు సందర్భాల్లో నిఫ్టీ ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగింది. అందుకే గత పదేళ్లుగా బడ్జెట్ల సమయంలో మార్కెట్లు ఎలా స్పందించాయో చూద్దాం.
*2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ, ఇది దలాల్ స్ట్రీట్ను ఏమాత్రం ఆకర్షించలేదు. దీంతో నిఫ్టీ ఏకంగా 2శాతం విలువ కోల్పోయింది. దాదాపు నెల రోజుల తర్వాత కూడా 0.2 నష్టాల్లో కొనసాగింది. 2009 బడ్జెట్ తర్వాత మార్కెట్ ఈ స్థాయి నష్టాలను చవిచూసింది. 2014లో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ను ఆకర్షించింది.
* 2014లో మోదీ సర్కారు తొలిసారి అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి జులై 10న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ మదుపర్లను స్వల్పంగా నిరాశపరిచింది. దీంతో నిఫ్టీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. కానీ, నెల రోజుల తర్వాత సూచీ 0.8శాతం లాభాల్లోకి వెళ్లింది.
* 2015లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తొలి రోజు మార్కెట్ను సంతోషపెట్టినా.. ఆ తర్వాత నష్టాల్లో ముంచేసింది. బడ్జెట్ రోజు నిఫ్టీ 0.7శాతం లాభపడింది. ఇక నెల తర్వాత భారీగా పతనమైంది. 4.6శాతం విలువ కోల్పోయింది.
* 2016లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ను తాత్కాలికంగా నిరాశకు గురిచేసింది. 0.6శాతం విలువ పతనం అయింది. కానీ, ఆ తర్వాత నుంచి మార్కెట్ భారీ లాభాల్లో పయనించింది. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 10.7శాతం లాభపడింది.
* 2017లో భారత్ చాలా కొత్త సంప్రదాయాలను ప్రారంభించింది. రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం మానేసింది. అంతేకాదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ సారి బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్లో భారీ ర్యాలీకి దారితీసి నిఫ్టీ 1.8శాతం లాభపడింది. 2011-20 మధ్యలో అతిపెద్ద బడ్జెట్ ర్యాలీ ఈ సంవత్సరం చోటు చేసుకొంది.
* కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లి తుది బడ్జెట్ను 2018లో సమర్పించారు. జీఎస్టీని తొలిసారి ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లోనే. ఈ బడ్జెట్ దలాల్ స్ట్రీట్ను ఏమాత్రం ఆకర్షించలేదు. సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 6శాతం విలువ కోల్పోయింది. 2011-21 మధ్యలో ఒక నెలరోజుల్లో నిఫ్టీ చవి చూసిన రెండో అతిపెద్ద పతనం ఇది. 2019లో ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మదుపర్లను ఆకర్షించింది. దీంతో నిఫ్టీ 0.6శాతం లాభపడింది.
* మోదీ 2.0 సర్కారులో నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కూడా మదుపరులను ఆకర్షించలేదు. పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లోని చాలా ప్రధాన విషయాల్లో నిర్మల సీతారామన్ స్పష్టత ఇవ్వలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నిఫ్టీ 1.1శాతం నష్టపోయింది. ఆ తర్వాత నెల రోజుల్లో 8శాతం విలువ కోల్పోయింది. 2011-21 మధ్యలో ఈ స్థాయిలో సూచీలు ఎప్పుడూ పతనం కాలేదు.
* 2020లో బడ్జెట్ కూడా మదుపర్ల అంచనాను చేరుకోలేదు. దీంతో అదే రోజు 2.5 శాతం పతనమైంది.
* 2021 బడ్జెట్కి దలాల్ స్ట్రీట్ ఉరకలు వేసింది. మార్కెట్ ఏకంగా 4.7శాతం లాభపడింది. 1999 తర్వాత మార్కెట్ బడ్జెట్ రోజు ఈ స్థాయిలో లాభపడటం ఇదే.
* ఇక 2022లో మార్కెట్లు బడ్జెట్ రోజు సానుకూలంగానే స్పందించింది. 1.4శాతం నిఫ్టీ పెరిగినా.. ఆ తర్వాత మెల్లగా సూచీ పతనమైంది. నెలరోజులు తిరిగేసరికి నిఫ్టీ 4.5శాతం నష్టాలను మూటగట్టుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.