Budget 2023: పన్నుపోటు నుంచి బీమాకు ఉపశమనంపై ఆశలు
భారత్లో బీమా రంగం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో వివిధ బీమా ప్రీమియంలపై పన్ను విధింపు ఇబ్బందికరంగా మారింది. ఈ సారి బడ్జెట్లో వీటిల్లో మార్పులు చేసి బీమాను మరింత ఆకర్షణీయంగా మారుస్తారనే ఆశలు ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: భారత్లో బీమాపై అవగాహన చాలా తక్కువ. ఇప్పటికీ ఎల్ఐసీ వంటి కంపెనీలు కూడా దేశంలోని బీమా మార్కెట్ను పూర్తిగా అందిపుచ్చుకోలేదు. 2022 నుంచి మాత్రం బీమా కొనుగోళ్లలో కొంత పెరుగుదల కనిపించింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఈ మాత్రం అవగాహన వచ్చింది. అదే సమయంలో బీమా రంగంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, క్లెయిమ్ల ఆటోమేషన్ వంటివి పారదర్శకతను గణనీయంగా పెంచుతాయి. ఇది బీమా రంగ గతినే పూర్తిగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్ నుంచి కొన్ని కీలక ప్రకటనలను బీమా రంగం ఆశిస్తోంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటును తగ్గించాలని కోరుతోంది.
సెక్షన్ 80సి డిడక్షన్ పరిధి పెంచాలి..
వివిధ రకాల పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద వ్యక్తులకు ఇచ్చే రాయితీ పరిధిని పెంచాల్సి ఉంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల పెట్టుబడులపై దీనిని ఇస్తున్నారు. దీనిని చివరి సారిగా 2014-15 బడ్జెట్లో రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షకు పెంచారు. ప్రస్తుతం దేశంలో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలను చేరుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీల్లో పెట్టుబడి పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడంతోపాటు.. బీమా రంగ విస్తరణకు మార్గం సుగమం చేస్తుంది.
సెక్షన్ 80డి కింద మరింత పన్ను మినహాయింపు..
భారత్లో దాదాపు 30 శాతం మంది ప్రజలకు ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణ లేదని 2021లో నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. మరో వైపు కేవలం వైద్య ఖర్చుల కారణంగా ఏటా 7 శాతం మంది పేదరికంలోకి జారుకొంటున్నారు. వైద్య ఖర్చులు కుటుంబాలను చిన్నాభిన్నం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తంపై పన్ను రాయితీ కల్పిస్తోంది. ప్రస్తుతం కొవిడ్ తర్వాత ఆరోగ్య బీమా పథకాలు మరింత ఖరీదయ్యాయి. దీంతో పన్ను మినహాయింపు లభించే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచాల్సిన అవసరం ఉంది.
పెన్షన్-యాన్యుటీ చెల్లింపులకు ప్రోత్సాహకాలు..
భారత్లో రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా పింఛను ఇచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. ఉద్యోగం చేస్తుండగానే వివిధ రకాల పింఛను పథకాల్లో పెట్టుబడులు పెట్టి.. పదవీ విరమణ తర్వాత వాటి నుంచి వచ్చే ఆదాయంపై బతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెన్షన్-యాన్యుటీ చెల్లింపులు పన్ను పరిధిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం జీవిత బీమా సంస్థలు విక్రయించే పింఛను పథకాలపై 80సి కింద మినహాయంపు పొందవచ్చు. కానీ, ఈ పథకాలకు ప్రత్యేకమైన రాయితీ లేదు. నేషనల్ పెన్షన్ స్కీం కింద చెల్లించే రూ.50 వేల వరకు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ప్రత్యేకంగా మినహాయింపు పొందవచ్చు. ఇటువంటి మినహాయింపును జీవిత బీమా రంగ సంస్థలు ప్రారంభించే పింఛను పథకాలకూ వర్తింపజేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ప్రయాణ బీమా..
కొవిడ్ తర్వాత ప్రయాణ బీమాపై అవగాహన పెరిగింది. ఈ సారి బడ్జెట్లో ఈ బీమా ప్రీమియంను కూడా ఎల్టీఏ మినహాయింపు పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇది మరింత మంది ప్రయాణ బీమాను తీసుకొనేలా ప్రోత్సహించే అవకాశం ఉంది.
థర్డ్పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్కు మినహాయింపులు..
ప్రస్తుతం వాహనాలకు థర్డ్ పార్టీ మోటార్ బీమా తప్పనిసరి. కానీ, దేశంలో సగానికి పైగా వాహనాలకు బీమాను పునరుద్ధరించడం లేదు. పెరిగిన బీమా ఖర్చులు, నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాహనాలకు థర్డ్పార్టీ బీమా ప్రీమియంపై పన్ను రాయితీ ఇచ్చి.. యజమానులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు వాహన బీమాపై రాయితీలు అందిస్తే ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు