Budget 2023: పన్నుపోటు నుంచి బీమాకు ఉపశమనంపై ఆశలు
భారత్లో బీమా రంగం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో వివిధ బీమా ప్రీమియంలపై పన్ను విధింపు ఇబ్బందికరంగా మారింది. ఈ సారి బడ్జెట్లో వీటిల్లో మార్పులు చేసి బీమాను మరింత ఆకర్షణీయంగా మారుస్తారనే ఆశలు ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: భారత్లో బీమాపై అవగాహన చాలా తక్కువ. ఇప్పటికీ ఎల్ఐసీ వంటి కంపెనీలు కూడా దేశంలోని బీమా మార్కెట్ను పూర్తిగా అందిపుచ్చుకోలేదు. 2022 నుంచి మాత్రం బీమా కొనుగోళ్లలో కొంత పెరుగుదల కనిపించింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఈ మాత్రం అవగాహన వచ్చింది. అదే సమయంలో బీమా రంగంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, క్లెయిమ్ల ఆటోమేషన్ వంటివి పారదర్శకతను గణనీయంగా పెంచుతాయి. ఇది బీమా రంగ గతినే పూర్తిగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్ నుంచి కొన్ని కీలక ప్రకటనలను బీమా రంగం ఆశిస్తోంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటును తగ్గించాలని కోరుతోంది.
సెక్షన్ 80సి డిడక్షన్ పరిధి పెంచాలి..
వివిధ రకాల పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద వ్యక్తులకు ఇచ్చే రాయితీ పరిధిని పెంచాల్సి ఉంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల పెట్టుబడులపై దీనిని ఇస్తున్నారు. దీనిని చివరి సారిగా 2014-15 బడ్జెట్లో రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షకు పెంచారు. ప్రస్తుతం దేశంలో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలను చేరుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీల్లో పెట్టుబడి పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడంతోపాటు.. బీమా రంగ విస్తరణకు మార్గం సుగమం చేస్తుంది.
సెక్షన్ 80డి కింద మరింత పన్ను మినహాయింపు..
భారత్లో దాదాపు 30 శాతం మంది ప్రజలకు ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణ లేదని 2021లో నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. మరో వైపు కేవలం వైద్య ఖర్చుల కారణంగా ఏటా 7 శాతం మంది పేదరికంలోకి జారుకొంటున్నారు. వైద్య ఖర్చులు కుటుంబాలను చిన్నాభిన్నం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తంపై పన్ను రాయితీ కల్పిస్తోంది. ప్రస్తుతం కొవిడ్ తర్వాత ఆరోగ్య బీమా పథకాలు మరింత ఖరీదయ్యాయి. దీంతో పన్ను మినహాయింపు లభించే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచాల్సిన అవసరం ఉంది.
పెన్షన్-యాన్యుటీ చెల్లింపులకు ప్రోత్సాహకాలు..
భారత్లో రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా పింఛను ఇచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. ఉద్యోగం చేస్తుండగానే వివిధ రకాల పింఛను పథకాల్లో పెట్టుబడులు పెట్టి.. పదవీ విరమణ తర్వాత వాటి నుంచి వచ్చే ఆదాయంపై బతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెన్షన్-యాన్యుటీ చెల్లింపులు పన్ను పరిధిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం జీవిత బీమా సంస్థలు విక్రయించే పింఛను పథకాలపై 80సి కింద మినహాయంపు పొందవచ్చు. కానీ, ఈ పథకాలకు ప్రత్యేకమైన రాయితీ లేదు. నేషనల్ పెన్షన్ స్కీం కింద చెల్లించే రూ.50 వేల వరకు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ప్రత్యేకంగా మినహాయింపు పొందవచ్చు. ఇటువంటి మినహాయింపును జీవిత బీమా రంగ సంస్థలు ప్రారంభించే పింఛను పథకాలకూ వర్తింపజేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ప్రయాణ బీమా..
కొవిడ్ తర్వాత ప్రయాణ బీమాపై అవగాహన పెరిగింది. ఈ సారి బడ్జెట్లో ఈ బీమా ప్రీమియంను కూడా ఎల్టీఏ మినహాయింపు పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇది మరింత మంది ప్రయాణ బీమాను తీసుకొనేలా ప్రోత్సహించే అవకాశం ఉంది.
థర్డ్పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్కు మినహాయింపులు..
ప్రస్తుతం వాహనాలకు థర్డ్ పార్టీ మోటార్ బీమా తప్పనిసరి. కానీ, దేశంలో సగానికి పైగా వాహనాలకు బీమాను పునరుద్ధరించడం లేదు. పెరిగిన బీమా ఖర్చులు, నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాహనాలకు థర్డ్పార్టీ బీమా ప్రీమియంపై పన్ను రాయితీ ఇచ్చి.. యజమానులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు వాహన బీమాపై రాయితీలు అందిస్తే ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి