Health Goals: జెరోదా సీఈఓ ఆరోగ్య చిట్కాలు.. మనమూ పాటించేద్దామా?
జెరోదా సీఈఓ నితిన్ కామత్ ట్విటర్లో తన ఫాలోవర్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పంచుకున్నారు. సరిపడా నిద్ర, మధ్య మధ్యలో లేచి నిలబడడం వంటివి మంచి ఆరోగ్యాన్నిస్తాయని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. అందుకోసం ప్రణాళికలు కూడా వేసుకుంటాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం వంటివి కచ్చితంగా ఉంటాయి. 90 శాతం మంది న్యూఇయర్ రిజల్యూషన్స్లో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉంటాయని ఓ సర్వేలో తేలింది. కానీ, డిసెంబరు 31 వచ్చే నాటికి వాటిని అమలు చేసేవాళ్లు ఎంతమంది? నిజానికి వాటిని సాధించలేకపోతున్నాం కాబట్టే అవి ప్రతి ఏడాది మన లక్ష్యాల్లో చేరుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని మన జీవితంలో భాగం చేసుకుంటే.. ప్రత్యేకంగా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి?
జెరోదా సీఈఓ నితిన్ కామత్కు ఫిట్నెస్పై శ్రద్ధ చాలా ఎక్కువ. ట్విటర్లో తరచూ ఆయన తన ఫాలోవర్లతో వివిధ అంశాలను పంచుకుంటుంటారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగానూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూసి.. వాటిని ఈ ఏడాది మన లక్ష్యాల్లో భాగం చేసుకుందాం. వచ్చే ఏడాదికల్లా వాటిని మన జీవితంలో భాగం చేసుకొని.. మళ్లీ 2024 తీర్మానాల్లో ప్రత్యేకంగా లేకుండా చూసుకుందామా మరి!
నితిన్ కామత్ సూచనలు ఆయన మాటల్లోనే..
‘‘గత కొన్నేళ్లుగా నేను ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాను. కొన్ని అంశాలను నేను, నా బృందం కలిసి పరీక్షించాం కూడా. భారతీయులను మరింత ఆరోగ్యంగా మార్చేందుకు దోహదం చేస్తున్న కొన్ని అంకుర సంస్థలకు తోడ్పాటునందిస్తున్నాం. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కావాల్సిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం..’’
- ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బు ఖర్చుపెట్టినా కూడా ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బు సంపాదనలో పడి మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. వయసు పెరిగే కొద్దీ.. మన ఆరోగ్యమే మనకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుంది. డబ్బు కాదు. ఏదైనా అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు వాటి నుంచి వేగంగా కోలుకోవడమే నిజమైన ఆరోగ్యం.
- ఆరోగ్యానికి సంబంధించి మీ లక్ష్యాలు.. మీ సంతోషం, సంతృప్తి, భావనలపై ఆధారపడి ఉండాలి. మీరు ఎలా కనబడతారనే దానిపై కాదు. ప్రముఖులను చూసి వారిలా కనపడాలని ఆరాటపడుతుంటాం. వాళ్లు ఫొటోగ్రఫీ, లైట్లు, కొన్ని రకాల ఔషధాలు.. వీటన్నింటినీ వాడి తాత్కాలికంగా అలా కనిపిస్తుంటారు. ఇవన్నీ చివరకు ఇబ్బందులకు కారణమవుతాయి..
- నిరంతరం కూర్చోవడం పొగతాగడం లాంటిదే. రోజులో ఎన్ని కెలరీలు ఖర్చు చేస్తున్నాం? ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడడం వంటి చిన్న చిన్న యాక్టివిటీలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆరోగ్యానికి సంబంధించి రోజూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. 90 శాతం దాన్ని చేరుకోవాలనేది ఇప్పుడు జెరోదాలో అమలు చేస్తున్నాం.
- రోజు ముగిసే సమయానికి మనలో అలసట పెరిగి స్వీయ నియంత్రణ కోల్పోతాం. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. దీన్ని త్వరగా నిద్రపోవడం అనే అలవాటు ద్వారా అధిగమించొచ్చు. అందుకే రాత్రి 9 గంటల కల్లా పడుకొని ఉదయం 5 గంటలకు లేవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజంతా ఆరోగ్యకరమైన అలవాట్లతో గడిపేందుకు పొద్దున చేసే వ్యాయామం దోహదం చేస్తుంది.
- మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. దీనికి ఇప్పటి వరకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. తక్కువ నిద్ర, ఎక్కువ పని చేయాలనే అంశాన్ని గొప్ప విషయంగా ప్రచారం చేస్తూ వచ్చారు. జీవితం మారథాన్ లాంటిది. వేగంగా పరిగెత్తుతూ దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోతే.. మధ్యలోనే అలసిపోతాం. అప్పుడు పరుగుకు బలమైన ముగింపునివ్వలేం.
- నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు డివైజ్లన్నింటినీ పక్కన పెట్టడం; అత్యవసరమైతే తప్ప సాయంత్రం ఆరు గంటల తర్వాత జెరోదా ఆన్లైన్లో వర్క్చాట్స్ను ముగించడం; నిద్రకు ముందు, వారాంతాల్లో.. మనసుకు ఉల్లాసాన్ని, విశ్రాంతినిచ్చే వ్యాపకాలకు సమయాన్ని కేటాయించడం.. ఇవి నాకు చక్కగా నిద్రపోవడానికి ఉపకరించాయి.
- పోషకాహారం విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానం అంటే నాకు చాలా ఇష్టం. కానీ, త్వరగా రాత్రిభోజనాన్ని ముగించడం, మద్యపానానికి ముందు ప్రోటీన్సహిత ఆహారాన్ని తీసుకోవడం, రిఫైన్డ్ షుగర్ లేని పండ్లు, ఖర్జూర, ‘స్టెవియా’ వంటివి ఆరగించడం ప్రారంభించాను. తద్వారా రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానాన్ని కోల్పోతానన్న భావనను అధిగమించాను.
- మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే భిన్నంగా ఉంటారు. మనకేది నప్పుతుందో కనుక్కోవడం ఓ స్వీయ ఆవిష్కరణ. అప్పుడే మనం అనుకున్నవాటిని నిరంతరాయంగా కొనసాగించగలుగుతాం. పుట్టినరోజు, కొత్త సంవత్సరం వంటి సందర్భాల్లో స్ఫూర్తిపొందడం కంటే అదే మంచి ఫలితాలిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.