Health Goals: జెరోదా సీఈఓ ఆరోగ్య చిట్కాలు.. మనమూ పాటించేద్దామా?
జెరోదా సీఈఓ నితిన్ కామత్ ట్విటర్లో తన ఫాలోవర్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పంచుకున్నారు. సరిపడా నిద్ర, మధ్య మధ్యలో లేచి నిలబడడం వంటివి మంచి ఆరోగ్యాన్నిస్తాయని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. అందుకోసం ప్రణాళికలు కూడా వేసుకుంటాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం వంటివి కచ్చితంగా ఉంటాయి. 90 శాతం మంది న్యూఇయర్ రిజల్యూషన్స్లో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉంటాయని ఓ సర్వేలో తేలింది. కానీ, డిసెంబరు 31 వచ్చే నాటికి వాటిని అమలు చేసేవాళ్లు ఎంతమంది? నిజానికి వాటిని సాధించలేకపోతున్నాం కాబట్టే అవి ప్రతి ఏడాది మన లక్ష్యాల్లో చేరుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని మన జీవితంలో భాగం చేసుకుంటే.. ప్రత్యేకంగా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి?
జెరోదా సీఈఓ నితిన్ కామత్కు ఫిట్నెస్పై శ్రద్ధ చాలా ఎక్కువ. ట్విటర్లో తరచూ ఆయన తన ఫాలోవర్లతో వివిధ అంశాలను పంచుకుంటుంటారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగానూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూసి.. వాటిని ఈ ఏడాది మన లక్ష్యాల్లో భాగం చేసుకుందాం. వచ్చే ఏడాదికల్లా వాటిని మన జీవితంలో భాగం చేసుకొని.. మళ్లీ 2024 తీర్మానాల్లో ప్రత్యేకంగా లేకుండా చూసుకుందామా మరి!
నితిన్ కామత్ సూచనలు ఆయన మాటల్లోనే..
‘‘గత కొన్నేళ్లుగా నేను ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాను. కొన్ని అంశాలను నేను, నా బృందం కలిసి పరీక్షించాం కూడా. భారతీయులను మరింత ఆరోగ్యంగా మార్చేందుకు దోహదం చేస్తున్న కొన్ని అంకుర సంస్థలకు తోడ్పాటునందిస్తున్నాం. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కావాల్సిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం..’’
- ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బు ఖర్చుపెట్టినా కూడా ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బు సంపాదనలో పడి మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. వయసు పెరిగే కొద్దీ.. మన ఆరోగ్యమే మనకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుంది. డబ్బు కాదు. ఏదైనా అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు వాటి నుంచి వేగంగా కోలుకోవడమే నిజమైన ఆరోగ్యం.
- ఆరోగ్యానికి సంబంధించి మీ లక్ష్యాలు.. మీ సంతోషం, సంతృప్తి, భావనలపై ఆధారపడి ఉండాలి. మీరు ఎలా కనబడతారనే దానిపై కాదు. ప్రముఖులను చూసి వారిలా కనపడాలని ఆరాటపడుతుంటాం. వాళ్లు ఫొటోగ్రఫీ, లైట్లు, కొన్ని రకాల ఔషధాలు.. వీటన్నింటినీ వాడి తాత్కాలికంగా అలా కనిపిస్తుంటారు. ఇవన్నీ చివరకు ఇబ్బందులకు కారణమవుతాయి..
- నిరంతరం కూర్చోవడం పొగతాగడం లాంటిదే. రోజులో ఎన్ని కెలరీలు ఖర్చు చేస్తున్నాం? ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడడం వంటి చిన్న చిన్న యాక్టివిటీలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆరోగ్యానికి సంబంధించి రోజూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. 90 శాతం దాన్ని చేరుకోవాలనేది ఇప్పుడు జెరోదాలో అమలు చేస్తున్నాం.
- రోజు ముగిసే సమయానికి మనలో అలసట పెరిగి స్వీయ నియంత్రణ కోల్పోతాం. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. దీన్ని త్వరగా నిద్రపోవడం అనే అలవాటు ద్వారా అధిగమించొచ్చు. అందుకే రాత్రి 9 గంటల కల్లా పడుకొని ఉదయం 5 గంటలకు లేవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజంతా ఆరోగ్యకరమైన అలవాట్లతో గడిపేందుకు పొద్దున చేసే వ్యాయామం దోహదం చేస్తుంది.
- మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. దీనికి ఇప్పటి వరకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. తక్కువ నిద్ర, ఎక్కువ పని చేయాలనే అంశాన్ని గొప్ప విషయంగా ప్రచారం చేస్తూ వచ్చారు. జీవితం మారథాన్ లాంటిది. వేగంగా పరిగెత్తుతూ దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోతే.. మధ్యలోనే అలసిపోతాం. అప్పుడు పరుగుకు బలమైన ముగింపునివ్వలేం.
- నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు డివైజ్లన్నింటినీ పక్కన పెట్టడం; అత్యవసరమైతే తప్ప సాయంత్రం ఆరు గంటల తర్వాత జెరోదా ఆన్లైన్లో వర్క్చాట్స్ను ముగించడం; నిద్రకు ముందు, వారాంతాల్లో.. మనసుకు ఉల్లాసాన్ని, విశ్రాంతినిచ్చే వ్యాపకాలకు సమయాన్ని కేటాయించడం.. ఇవి నాకు చక్కగా నిద్రపోవడానికి ఉపకరించాయి.
- పోషకాహారం విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానం అంటే నాకు చాలా ఇష్టం. కానీ, త్వరగా రాత్రిభోజనాన్ని ముగించడం, మద్యపానానికి ముందు ప్రోటీన్సహిత ఆహారాన్ని తీసుకోవడం, రిఫైన్డ్ షుగర్ లేని పండ్లు, ఖర్జూర, ‘స్టెవియా’ వంటివి ఆరగించడం ప్రారంభించాను. తద్వారా రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానాన్ని కోల్పోతానన్న భావనను అధిగమించాను.
- మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే భిన్నంగా ఉంటారు. మనకేది నప్పుతుందో కనుక్కోవడం ఓ స్వీయ ఆవిష్కరణ. అప్పుడే మనం అనుకున్నవాటిని నిరంతరాయంగా కొనసాగించగలుగుతాం. పుట్టినరోజు, కొత్త సంవత్సరం వంటి సందర్భాల్లో స్ఫూర్తిపొందడం కంటే అదే మంచి ఫలితాలిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ