Tax collection: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 23% వృద్ధి
Tax collection: సెప్టెంబరు 16 నాటికి రూ.1.22 లక్షల కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. స్థూలంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి.
దిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net direct tax collection) ఇప్పటి వరకు రూ.8.65 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. కార్పొరేట్ల నుంచి అధిక ముందస్తు పన్ను (Advance tax) వసూళ్లు.. వృద్ధికి దోహదం చేసినట్లు పేర్కొంది.
2023 సెప్టెంబరు 16 నాటికి వసూలైన రూ.8,65,117 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను (Net direct tax collection)ల్లో రూ.4.16 లక్షల కోట్లు కార్పొరేట్ ఆదాయపు పన్ను (corporate income tax) కాగా, రూ.4.47 లక్షల కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం (personal income tax). ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల (Net direct tax collection)లో 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. దీంట్లో ముందస్తు పన్ను వసూళ్లు రూ.3.55 లక్షల కోట్లు. క్రితం ఏడాది నమోదైన రూ.2.94 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి 21 శాతం వృద్ధి నమోదైంది. రూ.3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో రూ.2.80 లక్షల కోట్లు కార్పొరేట్ పన్నుల ఆదాయం కాగా.. రూ.74,858 కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం.
సెప్టెంబరు 16 నాటికి రూ.1.22 లక్షల కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. స్థూలంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 18.29 శాతం అధికం. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయంపై వసూలు చేసే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం నిదర్శనంగా చెబుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు