వర్క్కల్చర్పై నారాయణమూర్తి కామెంట్స్.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
Reactions on Narayana Murthy comments: వారానికి 70 గంటలు చొప్పున యువత పనిచేయాలంటూ నారాయణమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆయనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం విభేదించడం గమనార్హం.
Narayana Murthy | ఇంటర్నెట్ డెస్క్: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ( Narayana Murthy) అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ప్రజలు ఎలాగైతే విరామం ఎరుగక పనిచేశారో.. అదే తరహాలో దేశ యువత పనిచేయాలంటూ తాజాగా ఓ పాడ్కాస్ట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్లు మాత్రం నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.
వర్క్ కల్చర్ గురించి నారాయణమూర్తి (Narayana Murthy) వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తక్కువ పనిచేసి కాలం గడిపేయాల్సిన సమయం కాదని.. గతంలో ఇతర దేశాలు కొన్ని తరాల పాటు చేసిన పనిని ఇప్పుడు మనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ట్రేడ్ బ్రెయిన్ అండ్ ఫిన్ గార్డ్ సీఈఓ క్రితేశ్ అభిషేక్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చిన్న చిన్న లక్ష్యాల కోసమైతే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని.. పోటీ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే అదే స్థాయిలో కష్టపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదే విధానాన్ని నారాయణమూర్తి ఆచరించి విజయం సాధించారని అభిషేక్ రంగ్తా అనే ఆంత్రప్రెన్యూర్ అభిప్రాయపడ్డారు.
యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి
నారాయణమూర్తి (Narayana Murthy) అభిప్రాయంతో విభేదించిన వారూ ఉన్నారు. ఉత్పాదకత పెరగాలంటే ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం లేదని అప్గ్రాడ్ వ్యవస్థాపకుడు రోనీ స్క్య్రూవాలా పేర్కొన్నారు. నైపుణ్యాలకు పదునుపెట్టి, మెరుగైన పని వాతావరణం, సరిపడా వేతనం అందిస్తే.. ఇంకా ఎక్కువ ఉత్పాదకత రాబట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అందరికీ పని ప్రదేశం దగ్గర్లో ఉండదని, ట్రాఫిక్ చిక్కులు, మెట్రో రద్దీ వంటి సమస్యలతో యువత నిత్యం సావాసం చేయాల్సి ఉంటుందని, అలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 70 గంటలు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. అందుకు తగిన వేతనం కూడా ఇస్తారా మరి అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి నారాయణమూర్తి వ్యాఖ్యలు కొత్త చర్చకైతే తెరతీశాయి.
Full video..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
గోద్రేజ్ విభజన.. షేర్ల బదిలీతోనే
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.