Budget 2023: కేంద్ర బడ్జెట్.. ఈ ఆసక్తికర అంశాలు తెలుసా?
నిర్మలా సీతారామన్ వరుసగా 5వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ చరిత్రలో ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24 (Budget 2023)ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఐదోసారి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషం. ఈ తరుణంలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కీలకమైన కొన్ని బడ్జెట్లను చూద్దాం..
మొదటి బడ్జెట్..
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్ను బ్రిటిష్ రాణికి సమర్పించారు.
స్వతంత్ర భారత తొలి బడ్జెట్..
స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
అత్యధిక సార్లు ప్రవేశపెట్టినవారు..
బడ్జెట్ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. 1962-69 మధ్య 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాలల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్ను సమర్పించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. అయితే, ప్రధానిగా మాత్రం ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు.
ఆ తర్వాత పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే నాలుగు సార్లు ఆ క్రతువును పూర్తి చేశారు. 2023-24లో ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు..
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమయం మార్పు..
1999 వరకు బడ్జెట్ను ఫిబ్రవరిలో చివరి పనిదినాన, సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.
బడ్జెట్ తేదీ మార్పు..
బడ్జెట్ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే, 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు.
హల్వా వేడుక..
బడ్జెట్కు ముందు ఆనవాయితీగా హల్వా వేడుకను నిర్వహిస్తారు. అయితే, గత సంవత్సరం కొవిడ్ కారణంగా ఈ వేడుకను నిర్వహించలేదు. మిఠాయిలు పంచారు.
అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్లు..
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.
సుదీర్ఘ ప్రసంగం..
ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది.
ముద్రణ..
1950 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ లీక్ అయ్యింది. లీక్ కారణంగా అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించే బడ్జెట్ను, దిల్లీలోని మింట్రోడ్కు మార్చారు. 1980లో నార్త్బ్లాక్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలు పెట్టారు.
1995 వరకు బడ్జెట్ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ సిద్ధం చేయించింది.
పేపర్లెస్ బడ్జెట్..
2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారిగా పేపర్లెస్ బడ్జెట్ను సమర్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పేపర్లెస్ బడ్జెట్ను తీసుకొచ్చారు.
రైల్వే బడ్జెట్ విలీనం..
2017కు ముందు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ రెండింటిని విలీనం చేశారు.
బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు..
ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్ కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది.
బడ్జెట్పై మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు