Bitcoin: బిట్కాయిన్ ETFలకు అమెరికా అనుమతి.. ఊహాజనిత కరెన్సీకి ఊతం!
Bitcoin: క్రిప్టోకరెన్సీ చరిత్రలో కీలక మైలురాయి వంటి నిర్ణయం వెలువడింది. బిట్కాయిన్ ఆధారిత ఈటీఎఫ్లకు అమెరికా ఎస్ఈసీ అనుమతించింది.
Bitcoin ETF: ప్రధాన స్రవంతి పెట్టుబడి ఫండ్లలోకి బిట్కాయిన్ను (Bitcoin) అనుమతిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బిట్కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ల (Bitcoin ETF)ను అనుమతించింది. దీంతో క్రిప్టోకరెన్సీల్లో (cryptocurrency) ఇకపై పెన్షన్ ఫండ్స్ నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ఎవరైనా మదుపు చేయొచ్చు. కీలక మైలురాయిగా చెబుతున్న ఈ నిర్ణయంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది.
బిట్కాయిన్ ETFలను (Bitcoin ETF) ఆఫర్ చేసేందుకు పలు ప్రముఖ సంస్థలు చేసుకున్న 11 దరఖాస్తులకు అమెరికా ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC) బుధవారం ఆమోదం తెలిపింది. అదే సమయంలో క్రిప్టోలతో ఉన్న ముప్పును గుర్తుచేస్తూ మదుపర్లను అప్రమత్తం చేసింది. క్రిప్టోకరెన్సీపై (cryptocurrency) ఆసక్తి ఉన్నవారు మాత్రం తాజా పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు ఈ తరహా దరఖాస్తులను ఎస్ఈసీ తిరస్కరించింది. మదుపర్లకు నష్టం కలిగే అవకాశం ఉన్న పెట్టుబడి సాధనాలను ప్రోత్సహించలేమని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, ఎస్ఈసీ చెబుతున్న కారణాలు తిరస్కరణకు సరిపోవని ఓ న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఈ తరహా ఈటీఎఫ్లకు అనుమతివ్వడం అనివార్యమైంది.
బిట్కాయిన్ ఈటీఎఫ్ (Bitcoin ETF) అనుమతిని.. తాము క్రిప్టోకరెన్సీలకు ఇస్తున్న మద్దతుగా పొరబడొద్దని ఎస్ఈసీ ఛైర్మన్ గ్యారీ జెన్స్లర్ సోమవారమే మదుపర్లకు తెలిపారు. బిట్కాయిన్ ఊహాజనితమైందని.. విలువలో భారీ ఊగిసలాటలుంటాయని హెచ్చరించారు. దీన్ని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అందుకే మదుపర్లు క్రిప్టోలతో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఈటీఎఫ్ అంటే?
ఈటీఎఫ్లు (ETFs) కూడా స్టాక్స్ తరహాలోనే పనిచేస్తాయి. మ్యూచువల్ ఫండ్ లక్షణాలతో స్టాక్ మార్కెట్లో అవసరమైనప్పుడు ట్రేడ్ చేయగల సెక్యూరిటీల మిశ్రమమే ఈటీఎఫ్. మదుపర్ల దగ్గరి నుంచి సమీకరించిన నిధులతో వీటిని కొనుగోలు చేస్తారు. సెక్యూరిటీల మిశ్రమాన్ని ఈటీఎఫ్ యూనిట్గా పేర్కొంటారు. అవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. స్టాక్ తరహాలోనే వాటి విలువ వేగంగా మారుతూ ఉంటుంది. తాజాగా ఎస్ఈసీ అనుమతితో సెక్యూరిటీ మిశ్రమాల్లో బిట్కాయిన్నూ భాగం చేస్తారు.
ఈటీఎఫ్లు (ETFs) ఇటు షేర్లతో పాటు అటు మ్యూచువల్ ఫండ్ల వలె కూడా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్లో కొన్ని ఈటీఎఫ్ బ్లాక్లు కలిసి షేర్లలాగా వ్యవహరిస్తాయి. ఈటీఎఫ్ ఫండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉంటాయి. సాధారణ ట్రేడింగ్ సమయంలోనే వాటి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈటీఎఫ్ యూనిట్ విలువ దానిలో ఉన్న సెక్యూరిటీల విలువ ఆధారంగా మారుతూ ఉంటుంది. యూనిట్లో ఏ ఒక్క దాని ధర పెరిగినా ఈటీఎఫ్ విలువ బలపడుతుంది.
ఎందుకింత ఆసక్తి?
ఇప్పటి వరకు ప్రభుత్వాలు అధికారికంగా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులను ప్రోత్సహించలేదు. తాజాగా అగ్రరాజ్య ఎస్ఈసీ బిట్కాయిన్ ఈటీఎఫ్లకు అనుమతివ్వటంతో.. కనీసం ఊహాజనిత కరెన్సీగానైనా క్రిప్టోలను అధికారికంగా గుర్తించినట్లయిందని మదుపర్లు భావిస్తున్నారు. భారీ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు సైతం పెట్టుబడులతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో క్రిప్టోలకు ఆదరణ లభిస్తుందని.. మదుపర్లకు లాభాలను తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్నారు.
ఎలాంటి ముప్పుంది?
బిట్కాయిన్ (Bitcoin) సహా క్రిప్టోకరెన్సీల విలువల్లో భారీ ఊగిసలాటలుంటాయి. ఎలాంటి కారణాలు, ముందస్తు సంకేతాలు లేకుండానే విలువలు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. క్రిప్టో ఆధారిత ఈటీఎఫ్లలో మదుపు చేసేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి ఊహాజనిత కరెన్సీలయిన నేపథ్యంలో సైబర్మోసాలకు కూడా ఆస్కారముంది. మనీలాండరింగ్, మాదకద్రవ్యాల కొనుగోళ్ల వంటి అక్రమ కార్యకలాపాలకు వీటిని యథేచ్ఛగా ఉపయోగించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. వాటిలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి