Bitcoin: బిట్కాయిన్ ETFలకు అమెరికా అనుమతి.. ఊహాజనిత కరెన్సీకి ఊతం!
Bitcoin: క్రిప్టోకరెన్సీ చరిత్రలో కీలక మైలురాయి వంటి నిర్ణయం వెలువడింది. బిట్కాయిన్ ఆధారిత ఈటీఎఫ్లకు అమెరికా ఎస్ఈసీ అనుమతించింది.
Bitcoin ETF: ప్రధాన స్రవంతి పెట్టుబడి ఫండ్లలోకి బిట్కాయిన్ను (Bitcoin) అనుమతిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బిట్కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ల (Bitcoin ETF)ను అనుమతించింది. దీంతో క్రిప్టోకరెన్సీల్లో (cryptocurrency) ఇకపై పెన్షన్ ఫండ్స్ నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ఎవరైనా మదుపు చేయొచ్చు. కీలక మైలురాయిగా చెబుతున్న ఈ నిర్ణయంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది.
బిట్కాయిన్ ETFలను (Bitcoin ETF) ఆఫర్ చేసేందుకు పలు ప్రముఖ సంస్థలు చేసుకున్న 11 దరఖాస్తులకు అమెరికా ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC) బుధవారం ఆమోదం తెలిపింది. అదే సమయంలో క్రిప్టోలతో ఉన్న ముప్పును గుర్తుచేస్తూ మదుపర్లను అప్రమత్తం చేసింది. క్రిప్టోకరెన్సీపై (cryptocurrency) ఆసక్తి ఉన్నవారు మాత్రం తాజా పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు ఈ తరహా దరఖాస్తులను ఎస్ఈసీ తిరస్కరించింది. మదుపర్లకు నష్టం కలిగే అవకాశం ఉన్న పెట్టుబడి సాధనాలను ప్రోత్సహించలేమని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, ఎస్ఈసీ చెబుతున్న కారణాలు తిరస్కరణకు సరిపోవని ఓ న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఈ తరహా ఈటీఎఫ్లకు అనుమతివ్వడం అనివార్యమైంది.
బిట్కాయిన్ ఈటీఎఫ్ (Bitcoin ETF) అనుమతిని.. తాము క్రిప్టోకరెన్సీలకు ఇస్తున్న మద్దతుగా పొరబడొద్దని ఎస్ఈసీ ఛైర్మన్ గ్యారీ జెన్స్లర్ సోమవారమే మదుపర్లకు తెలిపారు. బిట్కాయిన్ ఊహాజనితమైందని.. విలువలో భారీ ఊగిసలాటలుంటాయని హెచ్చరించారు. దీన్ని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అందుకే మదుపర్లు క్రిప్టోలతో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఈటీఎఫ్ అంటే?
ఈటీఎఫ్లు (ETFs) కూడా స్టాక్స్ తరహాలోనే పనిచేస్తాయి. మ్యూచువల్ ఫండ్ లక్షణాలతో స్టాక్ మార్కెట్లో అవసరమైనప్పుడు ట్రేడ్ చేయగల సెక్యూరిటీల మిశ్రమమే ఈటీఎఫ్. మదుపర్ల దగ్గరి నుంచి సమీకరించిన నిధులతో వీటిని కొనుగోలు చేస్తారు. సెక్యూరిటీల మిశ్రమాన్ని ఈటీఎఫ్ యూనిట్గా పేర్కొంటారు. అవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. స్టాక్ తరహాలోనే వాటి విలువ వేగంగా మారుతూ ఉంటుంది. తాజాగా ఎస్ఈసీ అనుమతితో సెక్యూరిటీ మిశ్రమాల్లో బిట్కాయిన్నూ భాగం చేస్తారు.
ఈటీఎఫ్లు (ETFs) ఇటు షేర్లతో పాటు అటు మ్యూచువల్ ఫండ్ల వలె కూడా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్లో కొన్ని ఈటీఎఫ్ బ్లాక్లు కలిసి షేర్లలాగా వ్యవహరిస్తాయి. ఈటీఎఫ్ ఫండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉంటాయి. సాధారణ ట్రేడింగ్ సమయంలోనే వాటి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈటీఎఫ్ యూనిట్ విలువ దానిలో ఉన్న సెక్యూరిటీల విలువ ఆధారంగా మారుతూ ఉంటుంది. యూనిట్లో ఏ ఒక్క దాని ధర పెరిగినా ఈటీఎఫ్ విలువ బలపడుతుంది.
ఎందుకింత ఆసక్తి?
ఇప్పటి వరకు ప్రభుత్వాలు అధికారికంగా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులను ప్రోత్సహించలేదు. తాజాగా అగ్రరాజ్య ఎస్ఈసీ బిట్కాయిన్ ఈటీఎఫ్లకు అనుమతివ్వటంతో.. కనీసం ఊహాజనిత కరెన్సీగానైనా క్రిప్టోలను అధికారికంగా గుర్తించినట్లయిందని మదుపర్లు భావిస్తున్నారు. భారీ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు సైతం పెట్టుబడులతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో క్రిప్టోలకు ఆదరణ లభిస్తుందని.. మదుపర్లకు లాభాలను తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్నారు.
ఎలాంటి ముప్పుంది?
బిట్కాయిన్ (Bitcoin) సహా క్రిప్టోకరెన్సీల విలువల్లో భారీ ఊగిసలాటలుంటాయి. ఎలాంటి కారణాలు, ముందస్తు సంకేతాలు లేకుండానే విలువలు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. క్రిప్టో ఆధారిత ఈటీఎఫ్లలో మదుపు చేసేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి ఊహాజనిత కరెన్సీలయిన నేపథ్యంలో సైబర్మోసాలకు కూడా ఆస్కారముంది. మనీలాండరింగ్, మాదకద్రవ్యాల కొనుగోళ్ల వంటి అక్రమ కార్యకలాపాలకు వీటిని యథేచ్ఛగా ఉపయోగించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. వాటిలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..