Vodafone Idea: వొడాఫోన్లో ప్రభుత్వ వాటా.. ఎందుకు ఆలస్యం అవుతోంది?
వొడాఫోన్ ఐడియా బకాయిలను వాటాలుగా మార్చుకునే అంశం దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. దీంతో బ్యాంకులు నుంచి రుణం సమకూర్చుకోలేక, 5జీ సేవల విస్తరణపై దృష్టి పెట్టలేక ఆ కంపెనీ సతమతమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్ 5జీ విషయంలో దూసుకెళ్తున్నాయి. పోటాపోటీగా తమ సేవలను విస్తరించుకుంటూ వినియోగదారుల సంఖ్యను సైతం పెంచుకుంటున్నాయి. అదే ప్రైవేటు రంగానికి చెందిన వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) మాత్రం ఇప్పటి వరకు 5జీకి సంబంధించి ఊసే ఎత్తలేదు. 5జీ సేవల విస్తరణకు పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ప్రభుత్వ వాటా అంశం తేలే వరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. రుణం సమకూరితే గానీ కంపెనీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. బకాయిలను వాటాలుగా మార్చేందుకు ఓకే అన్న ప్రభుత్వం.. ప్రక్రియను పూర్తి చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో వీఐ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంతకీ వొడాఫోన్ బకాయిలను వాటాలుగా మార్చుకొనే విషయంలో ఆలస్యం దేనికి? ప్రభుత్వం ఏం చెప్తోంది?
రుణ ఇబ్బందుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్ వాయిదాలతో పాటు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలపై వడ్డీ చెల్లించడానికి బదులుగా ఆ మొత్తాన్ని సంస్థలో ఈక్విటీ వాటాగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వొడాఫోన్ ఇండియా అంగీకరించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.16వేల కోట్ల వడ్డీని సుమారు 33 శాతం వాటాగా మార్చేందుకు బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వం వాటా తీసుకుంటే ప్రమోటర్ల వాటా ఇప్పుడున్న 74.39 శాతం నుంచి 50 శాతం దిగువకు చేరనుంది.
మరెందుకు మార్చుకోవడం లేదు?
సంస్థ బకాయిలను ఈక్విటీలుగా మార్చే విషయంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఆమోదం తెలిపింది. అయితే, వొడాఫోన్ షేరు విలువ స్టాక్ మార్కెట్లో రూ.10 వద్ద స్థిరత్వం సాధించిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. అలాంటి నిబంధనేదీ లేదని వొడాఫోన్ ఐడియా వాదన. అయితే, షేరు విలువ రూ.10కు చేరుకోవడానికి వొడాఫోన్ ఆపసోపాలు పడుతోంది. షేరు విలువ పెరగకపోగా నానాటికీ పడిపోతోంది. మరోవైపు ప్రమోటర్లు కంపెనీలో తమ మూలధనాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. కంపెనీ స్థిరత్వం సాధించేందుకు రూ.40-50వేల కోట్లు అవసరం ఉండగా.. ప్రమోటర్లు కేవలం రూ.2-3వేల కోట్లకు మించి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.
కంపెనీకి రూ.10వేల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు 2022 జనవరిలో ప్రమోటర్లు హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, అప్పటి నుంచి కేవలం రూ.4900 కోట్లు మాత్రమే ప్రమోటర్లు మూలధనంగా పెట్టారు. అందులో చాలా వరకు మొత్తం ఇండస్ టవర్లకు చెల్లించాల్సిన మొత్తానికే వినియోగించారని తెలుస్తోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు రుణం కోసం వెళ్లగా అక్కడా చేదు అనుభవం ఎదురైంది. రూ.15-16వేల కోట్ల రుణం కోసం వెళ్లగా.. ప్రభుత్వ వాటా కోసం ఆ బ్యాంక్ స్పష్టత కోరినట్లు తెలిసింది.
ప్రస్తుత పరిస్థితేంటి?
గడిచిన రెండు మూడ్రోజులుగా వొడాఫోన్ అంశం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రమోటర్లు మూలధనం సమకూర్చకుండా బకాయిలను ఈక్విటీలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ససేమిరా అంటుండడంతో యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ బ్రిటన్లోని భారత హైకమిషనర్కు లేఖ రాసింది. ఈక్విటీలుగా మార్చుకునే సందర్భంలో ఇలా కండీషన్లు ఏవీ పెట్టలేదని, ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్ల కంపెనీ నిధుల సమీకరణ ఆలస్యమవుతోందని పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని భారత హైకమిషనర్ ఆర్థిక శాఖకు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై టెలికాం మంత్రి సైతం స్పందించారు. అయితే వాటాల మార్పు అంశం కంటే ముందు ఆ కంపెనీకి మూలధనం అవసరం అని చెప్పారు. అవి వేర్వేరు మార్గాల ద్వారా రావాల్సి ఉందని, వాటాలను మార్చుకోవడం ఒక్కటే సమస్య కాదన్నారు. మరోవైపు ఈక్విటీలను మార్చే అంశాన్ని వేగవంతం చేయాలని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా టెలికాం మంత్రిని కోరినట్లు తెలిసింది. మొత్తానికి కొన్ని రోజులుగా సాగుతూ వస్తున్న ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు కొనసా...గుతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ