Vodafone Idea: వొడాఫోన్లో ప్రభుత్వ వాటా.. ఎందుకు ఆలస్యం అవుతోంది?
వొడాఫోన్ ఐడియా బకాయిలను వాటాలుగా మార్చుకునే అంశం దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. దీంతో బ్యాంకులు నుంచి రుణం సమకూర్చుకోలేక, 5జీ సేవల విస్తరణపై దృష్టి పెట్టలేక ఆ కంపెనీ సతమతమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్ 5జీ విషయంలో దూసుకెళ్తున్నాయి. పోటాపోటీగా తమ సేవలను విస్తరించుకుంటూ వినియోగదారుల సంఖ్యను సైతం పెంచుకుంటున్నాయి. అదే ప్రైవేటు రంగానికి చెందిన వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) మాత్రం ఇప్పటి వరకు 5జీకి సంబంధించి ఊసే ఎత్తలేదు. 5జీ సేవల విస్తరణకు పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ప్రభుత్వ వాటా అంశం తేలే వరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. రుణం సమకూరితే గానీ కంపెనీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. బకాయిలను వాటాలుగా మార్చేందుకు ఓకే అన్న ప్రభుత్వం.. ప్రక్రియను పూర్తి చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో వీఐ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంతకీ వొడాఫోన్ బకాయిలను వాటాలుగా మార్చుకొనే విషయంలో ఆలస్యం దేనికి? ప్రభుత్వం ఏం చెప్తోంది?
రుణ ఇబ్బందుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్ వాయిదాలతో పాటు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలపై వడ్డీ చెల్లించడానికి బదులుగా ఆ మొత్తాన్ని సంస్థలో ఈక్విటీ వాటాగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వొడాఫోన్ ఇండియా అంగీకరించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.16వేల కోట్ల వడ్డీని సుమారు 33 శాతం వాటాగా మార్చేందుకు బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వం వాటా తీసుకుంటే ప్రమోటర్ల వాటా ఇప్పుడున్న 74.39 శాతం నుంచి 50 శాతం దిగువకు చేరనుంది.
మరెందుకు మార్చుకోవడం లేదు?
సంస్థ బకాయిలను ఈక్విటీలుగా మార్చే విషయంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఆమోదం తెలిపింది. అయితే, వొడాఫోన్ షేరు విలువ స్టాక్ మార్కెట్లో రూ.10 వద్ద స్థిరత్వం సాధించిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. అలాంటి నిబంధనేదీ లేదని వొడాఫోన్ ఐడియా వాదన. అయితే, షేరు విలువ రూ.10కు చేరుకోవడానికి వొడాఫోన్ ఆపసోపాలు పడుతోంది. షేరు విలువ పెరగకపోగా నానాటికీ పడిపోతోంది. మరోవైపు ప్రమోటర్లు కంపెనీలో తమ మూలధనాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. కంపెనీ స్థిరత్వం సాధించేందుకు రూ.40-50వేల కోట్లు అవసరం ఉండగా.. ప్రమోటర్లు కేవలం రూ.2-3వేల కోట్లకు మించి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.
కంపెనీకి రూ.10వేల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు 2022 జనవరిలో ప్రమోటర్లు హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, అప్పటి నుంచి కేవలం రూ.4900 కోట్లు మాత్రమే ప్రమోటర్లు మూలధనంగా పెట్టారు. అందులో చాలా వరకు మొత్తం ఇండస్ టవర్లకు చెల్లించాల్సిన మొత్తానికే వినియోగించారని తెలుస్తోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు రుణం కోసం వెళ్లగా అక్కడా చేదు అనుభవం ఎదురైంది. రూ.15-16వేల కోట్ల రుణం కోసం వెళ్లగా.. ప్రభుత్వ వాటా కోసం ఆ బ్యాంక్ స్పష్టత కోరినట్లు తెలిసింది.
ప్రస్తుత పరిస్థితేంటి?
గడిచిన రెండు మూడ్రోజులుగా వొడాఫోన్ అంశం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రమోటర్లు మూలధనం సమకూర్చకుండా బకాయిలను ఈక్విటీలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ససేమిరా అంటుండడంతో యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ బ్రిటన్లోని భారత హైకమిషనర్కు లేఖ రాసింది. ఈక్విటీలుగా మార్చుకునే సందర్భంలో ఇలా కండీషన్లు ఏవీ పెట్టలేదని, ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్ల కంపెనీ నిధుల సమీకరణ ఆలస్యమవుతోందని పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని భారత హైకమిషనర్ ఆర్థిక శాఖకు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై టెలికాం మంత్రి సైతం స్పందించారు. అయితే వాటాల మార్పు అంశం కంటే ముందు ఆ కంపెనీకి మూలధనం అవసరం అని చెప్పారు. అవి వేర్వేరు మార్గాల ద్వారా రావాల్సి ఉందని, వాటాలను మార్చుకోవడం ఒక్కటే సమస్య కాదన్నారు. మరోవైపు ఈక్విటీలను మార్చే అంశాన్ని వేగవంతం చేయాలని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా టెలికాం మంత్రిని కోరినట్లు తెలిసింది. మొత్తానికి కొన్ని రోజులుగా సాగుతూ వస్తున్న ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు కొనసా...గుతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్