హాథ్రస్ ఘటనలో షాకింగ్ మలుపు!
హాథ్రస్ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో......
ఆరు నెలల్లో వందకు పైగా ఫోన్ కాల్స్..
దిల్లీ: హాథ్రస్ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్లో సంభాషించినట్టు వారు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.
సెప్టెంబర్ 14న యూపీలోని హాథ్రస్ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్