హాథ్రస్ ఘటనలో షాకింగ్ మలుపు!
హాథ్రస్ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో......
ఆరు నెలల్లో వందకు పైగా ఫోన్ కాల్స్..
దిల్లీ: హాథ్రస్ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్లో సంభాషించినట్టు వారు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.
సెప్టెంబర్ 14న యూపీలోని హాథ్రస్ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?