Hyd News: మూడ్రోజులుగా తల్లి మృతదేహంతో గడిపిన కుమారుడు

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి పరిధిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది.

Updated : 14 May 2022 10:25 IST

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి పరిధిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మూడ్రోజులుగా తల్లి మృతదేహం వద్ద కుమారుడు సాయికృష్ణ(22) గడపడం స్థానికంగా కలకలం రేపింది. అతని మానసికస్థితి సరిగ్గా ఉండడని స్థానికులు చెప్పారు. తల్లి, కుమారుడి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని తెలిపారు. తల్లిని కుమారుడే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉదయం మహిళ మృతిచెందిన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహన్ని గుర్తించారు. కుమారుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని