Hyderabad News: హైదరాబాద్లో ‘డార్క్ వెబ్’ మత్తు దందా.. ముఠా అరెస్ట్
నగరంలో మరో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హుమయూన్ నగర్లో
హైదరాబాద్: నగరంలో మరో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హుమయూన్ నగర్లో డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9లక్షల విలువైన సరకును నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ‘డార్క్ వెబ్’ ద్వారా మత్తు దందా చేస్తున్నారని చెప్పారు. 30మంది వినియోగదారులను సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు.
‘‘డార్క్ వెబ్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ‘విక్కర్ మీ’ అనే యాప్ ద్వారా మత్తు పదార్థాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి దందా చేస్తున్నారు. గోవాకు చెందిన నరేంద్ర ఆర్య అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించాం. అతడు ఏడాది కాలంగా ఈ దందాతో దాదాపు రూ.30లక్షల లావాదేవీలు చేశాడు. దేశవ్యాప్తంగా 450 మంది వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించాం.
రాజస్థాన్కు చెందిన ఫర్హాన్ అహ్మద్ అనే మరో వ్యక్తిని కూడా గుర్తించి అరెస్టు చేశాం. అతడు రూ.15లక్షల లావాదేవీలు చేసినట్లు తేల్చాం. యాప్లో రకరకాల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వాటన్నింటిపై నిఘా పెట్టాం. ఇతర రాష్ట్రాల్లో వాళ్లు నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు. కానీ, గోవా, బెంగళూరు, దిల్లీ వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ఈ ముఠాపై దృష్టి సారించాం. సంపన్నులే లక్ష్యంగా డ్రగ్స్ దందా సాగుతోంది. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిగాక కొరియర్లో డ్రగ్స్ సప్లయి చేస్తున్నారు. డ్రగ్స్ విక్రేతల వాట్సాప్ చాటింగ్ను పరిశీలించాం. తల్లిదండ్రులు కూడా తమ పిలల్లకు వచ్చే పార్సిళ్లను పరిశీలించాలి’’ అని సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్