మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు?
సంచలనం సృష్టించిన మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సైఫాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లోని చింతలబస్తీలో
కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సైఫాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లోని చింతలబస్తీలో గల వైశ్య భవన్లో మారుతీరావు మృతి చెందిన విషయం విదితమే. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటే కేవలం కూతురు దూరమైందన్న బాధ మాత్రమేనా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. మారుతీరావు శరీరావయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించిన నేపథ్యంలో నివేదిక రావడానికి కనీసం రెండు వారాల సమయం పట్టనుంది. ఆలోపు చేయాల్సిన కార్యాచరణపై దృష్టి సారించారు. ఇప్పటికే అతను విష ప్రభావంతోనే మరణించినట్లు పోలీసులకు ఉస్మానియా వైద్యులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న విషయాన్నీ వివరించారు. మారుతీరావు మరణం తర్వాత అతడు చనిపోయిన గది నుంచి ఇప్పటికే సూట్కేసు, సెల్ఫోన్, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనితో చివరి రెండు, మూడు రోజుల్లో మాట్లాడిన కాల్డాటాపైనా దృష్టి సారించినట్లు సమాచారం. కొంత సమాచారాన్ని సేకరించాక ఆయనతో టచ్లో ఉన్న వారిని పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు