అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు.
మూడు రోజుల కస్టడీకి అరుణ్రెడ్డి
దిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ బృందం జాతీయ సమన్వయ కర్త, తెలంగాణకు చెందిన అరుణ్రెడ్డిని శుక్రవారం దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీడియో కేసులో దిల్లీ పోలీసులు చేసిన తొలి అరెస్టు ఇది. అరుణ్.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ‘స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్’ ఖాతా నిర్వహిస్తున్నారు. వీడియో మార్ఫింగ్ వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగుందనే అనుమానం రావడంతోనే ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) అభియోగాన్ని చేర్చామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అరుణ్రెడ్డిని శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి లభించింది. దీంతో నిందితుడిని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో ఉంచి ప్రశ్నిస్తున్నారు. నకిలీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తుల్లో అరుణ్ ఒకరని పోలీసులు పేర్కొంటున్నారు. సైబర్ నేరాల సమన్వయ కేంద్రం నుంచి ఫిర్యాదు రావడంతో తొలుత ఐపీసీ సెక్షన్ 153, సెక్షన్ 153ఎ, సెక్షన్ 465, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 66సీ తదితరాలను నిందితులపై పోలీసులు మోపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు