Crime News: నల్గొండలో నిత్య పెళ్లికొడుకు.. 19 మందిని మోసం చేసిన మత ప్రచారకుడు
పెళ్లి పేరిట యువతులను మోసగిస్తున్న మత ప్రచారకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్ వాయించే మత ప్రచారకుడు,
టీఎస్ విలియమ్స్
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: పెళ్లి పేరిట యువతులను మోసగిస్తున్న మత ప్రచారకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్ వాయించే మత ప్రచారకుడు, వైద్యఆరోగ్యశాఖలో ల్యాబ్టెక్నీషియన్గా పనిచేస్తున్న టీఎస్ విలియమ్స్ను మంగళవారం పోలీసులు రిమాండ్కు పంపారు. విలియమ్స్ తనను పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశారు.. రూ.20 లక్షల నగదు తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడంటూ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విలియమ్స్ పలువురి యువతులతో సంబంధాలున్నట్లు పోలీసు విచారణలో తెలిసినట్లు సమాచారం. మత ప్రచారంతో పాటు డ్రమ్స్ వాయిస్తూ యువతులను తన వైపు ఆకర్శిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
నిత్య పెళ్లి కొడుకుగా మారి 19 మందిని మోసం చేసిన వ్యక్తి అంటూ సామాజిక, ప్రసార మాధ్యమాల్లో మంగళవారం హల్చల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. పోలీసులు ఇంటికి వస్తున్నారనే సమాచారం తెలియడంతో గుండెపోటు వచ్చినట్లు నటించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి పలు రకాల పరీక్షలు చేయించారు. గుండెతో పాటు ఇతర వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడంతో నిందితుడిపై ఐపీసీ 376,377,342,420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ బాలగోపాల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!