విజయవాడలో విషాదం.. ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలుడు..

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సూర్యారావుపేటలో విషాదం చోటుచేసుకుంది. 

Updated : 23 Apr 2022 13:26 IST

ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

విజయవాడ : అతడు కొత్తగా ఎలక్ట్రికల్‌ బైక్‌ కొన్నాడు. అయితే.. ఆ ఆనందం గంటల్లోనే ఆవిరైంది. ఆ వాహనమే అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌  పెట్టిన అనంతరం అది పేలింది. ఈ ఘటనలో కుటుంబ పెద్ద మృతి చెందగా.. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. వారి పిల్లలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని సూర్యారావుపేట  గులాబీతోట ప్రాంతానికి చెందిన  శివకుమార్‌ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్‌  బైక్‌ కొనుగోలు చేశాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్‌తోపాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులతో ఇరుగుపొరుగు వాసులు తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. శివకుమార్‌ మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పిల్లలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని