తనతో గడపాలని రమ్మని.. డబ్బులు తీసుకొని దాడి చేసి!

యువకుడిని ఇంటికి పిలిపించుకొని.. డబ్బు తీసుకొని దాడి చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.. క్రైమ్‌ విభాగం సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ

Updated : 02 Jul 2022 04:07 IST

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: యువకుడిని ఇంటికి పిలిపించుకొని.. డబ్బు తీసుకొని దాడి చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.. క్రైమ్‌ విభాగం సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం హమాలీకాలనీకి చెందిన కందుల వంశీ(25), భార్య పల్లపు రోజా(24), ఆమె సోదరి పల్లపు దేవి ఘట్‌కేసర్‌ మండలం పోచారానికి వలసొచ్చారు. వీరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లెక్చరర్‌ వీధికి చెందిన సాగి వర్మ(26) పరిచయమయ్యాడు. రోజా గత నెల 27న రాత్రి హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగికి(28)కి ఫోన్‌ చేసి.. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని వస్తే తనతో రాత్రి గడపొచ్చని చెప్పింది. నమ్మిన యువకుడు వెళ్లాడు. మధ్యరాత్రి వంశీ, దేవి, సాగివర్మ ఇంట్లోకి ప్రవేశించి యువకుడిని చితక బాదారు. అతని వద్ద ఉన్న ఏటీఎం, డెబిట్‌కార్డు నుంచి రూ.2.2 లక్షల నగదు డ్రా చేసుకున్నారు. చరవాణి తీసుకొని బెదిరించి పంపించారు. బాధితుడు గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుల నుంచి రూ.1.60 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని