అద్దెకున్నవారే మట్టుబెట్టారు
చెడు వ్యసనాలకు బానిసై, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరి మహిళలను, ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు.
సింగరాయకొండ మహిళ హత్యకేసులో ఆరుగురి అరెస్టు
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ మలికా గార్గ్..
చిత్రంలో అదనపు ఎస్పీ శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు
సింగరాయకొండ గ్రామీణం, టంగుటూరు, న్యూస్టుడే: చెడు వ్యసనాలకు బానిసై, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరి మహిళలను, ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సింగరాయకొండ హనుమాన్నగర్లో ఈ నెల 17న హత్యకు గురైన పులిబండ్ల నారాయణమ్మ(65) కేసులో నిందితుల వివరాలను బుధవారం ఎస్పీ మలికా గార్గ్, అధికారులతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్లో వెల్లడించారు. సోమరాజుపల్లికి చెందిన చిటితోటి రాజశేఖర్, అతని ప్రియురాలు గొల్లపూడి వరలక్ష్మి.. కొన్నాళ్లుగా నారాయణమ్మ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నారాయణమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్నేసి చోరీ చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన అడకా భూలక్ష్మితో కలిసి వీరు పథకం రచించారు. వరలక్ష్మి కుమారుడు అశోక్.. అతని స్నేహితులు జాఫర్ (బాలాజీనగర్), సందీప్ అలియాస్ చిన్ను (యలమందారెడ్డినగర్)లకు వివరించారు. ఈ నెల 17న సాయంత్రం 7.30 గంటల సమయంలో నారాయణమ్మ ఇంటిలో ఉండగా యువకులు ముగ్గురూ ప్రహరీ దూకి ప్రవేశించారు. రాజశేఖర్, వరలక్ష్మి, భూలక్ష్మిలు రోడ్డుపై ఉండి వచ్చీపోయే వారిని గమనిస్తూ చరవాణి ద్వారా సమాచారం చేరవేసేవారు. నారాయణమ్మకు కత్తి చూపించి ఆభరణాలు, నగదు ఇవ్వాలని యువకులు బెదిరించారు. ఆమె వాదనకు దిగడంతో దాడి చేశారు. నారాయణమ్మ ముఖంపై దిండుతో గట్టిగా అదమడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. నిందితులు 76 గ్రాముల బంగారం, బీరువాలో ఉన్న నగదు తీసుకొని పరారయ్యారు. సమాచారం అందడంతో అదనపు ఎస్పీ శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సీఐ రంగనాథ్, ఎస్సై ఫిరోజా ఫాతిమా పరిశీలించారు. ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. 48 గంటల్లోనే కేసు ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. అధికారులతో పాటు ఎస్సైలు వెంకటేశ్వరరావు, ఖాదర్బాషా, ఫిరోజా ఫాతిమా, సిబ్బందిని డీఐజీ, ఎస్పీలు అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.
దస్త్రాల పరిశీలన
తొలుత సింగరాయకొండ స్టేషన్లో దస్త్రాలను డీఐజీ త్రివిక్రమవర్మ పరిశీలించారు. అనంతరం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?