లారీ చోరీ.. ‘పొరుగు’ దారి
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తుక్కుగా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలు..?
ఈ నెల 17వ తేదీన కాగజ్నగర్ పట్టణం పెట్రోల్పంపు నివాసి విజయ్కుమార్ తన లారీని ప్రయాణ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచారు. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు దానిని అపహరించారు. దీనిని కాగజ్నగర్ అంతర్రాష్ట్ర రహదారిగుండా మహారాష్ట్ర వైపు తీసుకెళ్లినట్లు సిర్పూర్(టి) ఏరియాలోని సీసీ కెమెరాలోని సీసీ ఫుటేజీ లభించింది.
కాగజ్నగర్, న్యూస్టుడే: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న భారీ వాహనాలను కూడా దొంగలు మాయం చేస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్తోపాటు, పలు మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉండటాన్ని ఆసరాగా తీసుకొని అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు లారీలను అపహరిస్తున్నారు. ఇటీవల బస్టాండ్ సమీపంలో నిలిపి ఉన్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
* 2014 సంవత్సరంలో పట్టణంలోని పెట్రోల్పంపు ఏరియాలో నిలిపి ఉన్న అఫ్జల్కు సంబంధించిన లారీ, రెండేళ్ల క్రితం కులదీప్సింగ్, భవాణి ప్రసాద్లకు సంబంధించిన లారీలు కూడా చోరీకి గురయ్యాయి. తాజాగా విజయ్కుమార్కు చెందిన లారీ కూడా అపహరణకు గురైంది. ఇప్పటి వరకు నాలుగు లారీలు చోరీ జరిగినప్పటికీ ఏ ఒక్క కేసు మిస్టరీ వీడలేదు.
* జిల్లా పోలీసులతో పాటు, ఎంవీఐ అధికారులు సైతం లారీ చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు లభించిన సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందం సభ్యులు మహారాష్ట్రతోపాటు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో ఆ పోలీసుల సహకారంతో విచారణ ప్రారంభించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించనట్లు తెలిసింది.
*మహారాష్ట్రలోని నాందేడ్, అమరావతి, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ప్రాంతాల్లో తుక్కు పరిశ్రమలకు వీటిని విక్రయిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న లారీలు, ఇతర వాహనాలను అపహరించి, వాటిని ఈ తుక్కు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తుక్కు కేంద్రాలు ఆ వాహనాలను అతి తక్కువకే కొనుగోలు చేసి, వాటిని రెండ్రోజుల్లో యంత్రాల్లో వేసి, తక్కుగా మార్చుతున్నారు. ఇనుప తుక్కును ఉక్కు పరిశ్రమలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో చోరీకి గురైన వాహనాలు ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఆధారాలు లభించకుండా తుక్కు స్మగ్లర్లు వ్యూహత్మకంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
లారీ చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం లారీ మహారాష్ట్రలోని రాజురా వరకు వెళ్లినట్లు తేలింది. రాజుర నుంచి నాలుగు రహదారులుండగా, ఏ ప్రాంతం వైపు వెళ్లిందన్న కోణంలో విచారణ చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఆ లారీలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?