చోరీకి వచ్చి నిద్రలోకి జారుకున్న దొంగ
చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడ ఉన్న చాక్లెట్లు, ఆహారం తినేసి నిద్రలోకి జారుకున్న ఘటన చెన్నైలో జరిగింది.
చెన్నై (ప్యారిస్), న్యూస్టుడే: చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడ ఉన్న చాక్లెట్లు, ఆహారం తినేసి నిద్రలోకి జారుకున్న ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఇక్కడి అడయారు ప్రాంతంలోని ఓ భవనం మూడో అంతస్తులో కార్తీక్ నరేన్ అనే వ్యక్తి నివసిస్తుండగా, రెండో అంతస్తులోని మరో ఫ్లాట్లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ నెల 9న వారు తిరిగి వస్తుండటంతో నరేన్ వారి ఇంటి తాళం తీసి తన ఫ్లాట్కి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తమ ఇంటికి చేరుకున్న ఈ జంటకు వారి ఇంట్లోనే ఓ వ్యక్తి నిద్రిస్తూ కనిపించాడు. అతడ్ని లేపడంతోనే అక్కడి నుంచి పారిపోయి మరో ఇంట్లోకి దూరాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీ చేసిన రూ.41 వేల నగదు, 20 విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితుడ్ని తిరువణ్ణామలైకి చెందిన ఏళుమలైగా గుర్తించారు. విల్లివాక్కంలో ఉంటూ భవన నిర్మాణ పనులకు వెళ్లే ఏళుమలై.. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వచ్చి చోరీ చేశాడు. అక్కడ ఉన్న ఆహారం, ఫ్రిడ్జ్లో ఉన్న విదేశీ చాక్లెట్లు తిని మద్యం మత్తులో నిద్రపోయినట్లు తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్