అమరేంద్ర కుమార్ చుట్టూ వివాదాలు
పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్య కేసులో... ఆ శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర చర్చ నడుస్తోంది.
తనకేమైనా జరిగితే ఆయనే బాధ్యుడని లేఖలో పేర్కొన్న అచ్చెన్న
ఈనాడు, అమరావతి: పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్య కేసులో... ఆ శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన్ను సస్పెండ్ చేసి విచారణ చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండు చేస్తున్నారు. హత్య ఘటన వెలుగు చూసినప్పటి నుంచి అమరేంద్ర చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తనకు ఏమైనా జరిగితే డైరెక్టర్ అమరేంద్ర కుమార్తో పాటు డీఏహెచ్ శారదమ్మ బాధ్యులని అచ్చెన్న.. తన మరణానికి ముందు డైరెక్టర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి మానసికంగా కుంగిపోయే పరిస్థితికి తెచ్చారని, ఆ పరిస్థితికి కారకులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్న కుమారుడు క్లింటన్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల పాత్రపై అనుమానం వెలిబుచ్చారు. ఫిర్యాదులోనూ మొదటగా అమరేంద్ర కుమార్ పేరునే ప్రస్తావించినా.. తర్వాత దాన్ని కొట్టేయించారని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. అచ్చెన్న కనిపించకుండా పోయిన తర్వాత.. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్న హత్యకేసులో నియమించిన విచారణ కమిటీలో సభ్యులూ ఆయనకు సన్నిహితులని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను పదవి నుంచి తొలగిస్తేనే నిష్పాక్షిక విచారణ జరుగుతుందని పలువురు డిమాండు చేస్తున్నారు.
గతంలోనూ వివాదాలు
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్నప్పుడు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అప్పటి ఛైర్మన్తో విభేదాలు తలెత్తాయి. పెద్దఎత్తున రచ్చ జరగడంతో.. అప్పటి ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది.
అమరేంద్రపై ఆరోపణలు సత్యదూరం
డిప్యూటీ డైరెక్టర్ చిన్న అచ్చెన్న మరణానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ అధికారుల సర్వీసు అసోసియేషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్పై ఆరోపణలు సత్యదూరమని, దీనిలో రాజకీయాలు లేకుండా దోషుల్ని కఠినంగా శిక్షించాలని సంఘం అధ్యక్షుడు ఎస్.జయచంద్ర డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు. -
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?