Cyber Crime: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ.86 లక్షల టోకరా
పార్ట్టైమ్ ఉద్యోగం పేరిట ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. మొదట ఆన్లైన్లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్, రివ్యూలు ఇవ్వాలని నమ్మించి, చివరికి క్రిప్టో పెట్టుబడుల పేరిట రూ.86.96 లక్షలు స్వాహా చేశారు.
ఈనాడు- హైదరాబాద్: పార్ట్టైమ్ ఉద్యోగం పేరిట ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. మొదట ఆన్లైన్లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్, రివ్యూలు ఇవ్వాలని నమ్మించి, చివరికి క్రిప్టో పెట్టుబడుల పేరిట రూ.86.96 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి గత నెల చివరివారంలో ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఎన్ఐఈఎల్ఐటీ సంస్థ మానవ వనరుల విభాగం నుంచి మాట్లాడుతున్నామని.. గూగుల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే రోజూ డబ్బు జమ చేస్తామని అందులోని సారాంశం. ఈ మేరకు వారు పంపిన లింకుల ఆధారంగా కొన్ని రివ్యూలు రాయగా కొంత డబ్బు పంపించారు. తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటూ మభ్యపెట్టి ఒక లింకు ఇచ్చారు. బాధితుడు అందులో లాగిన్ అయ్యి.. మొదట రూ.వెయ్యి పెట్టుబడి పెట్టగా, తిరిగి రూ.1,420 చెల్లించారు. దీంతో నమ్మకం ఏర్పడి దఫదఫాలుగా రూ.86.96 లక్షలు పెట్టుబడి పెట్టారు. కానీ రూ.9,970 మాత్రమే తిరిగి ఇచ్చారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్