ట్రావెల్స్‌ బస్సులో రూ.72 లక్షల గంజాయి పట్టివేత

ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన మురగన్‌ వీరమణికండన్‌, రంగసామిసెల్వం చెన్నై నుంచి బస్సులో ప్రయాణికులతో విశాఖపట్నం వచ్చారు.

Published : 05 Dec 2021 05:23 IST

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన మురగన్‌ వీరమణికండన్‌, రంగసామిసెల్వం చెన్నై నుంచి బస్సులో ప్రయాణికులతో విశాఖపట్నం వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఏజెన్సీకి వెళ్లి గంజాయి బస్తాలు లోడు చేసుకొని తమిళనాడుకు ప్రయాణమయ్యారు. రావులపాలెం మండలం రావులపాడులోని మల్లాయిదొడ్డి వద్ద పోలీసులు బస్సు తనిఖీ చేసి 715.530 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.72 లక్షలు ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని