Crime News: మరో 24 గంటల్లో పెళ్లి.. యువకుడి వేధింపులకు యువతి బలి
మరో 24 గంటల్లో పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులకు బలైంది. ఆమె ఆత్మహత్యతో పెళ్లింట విషాదం అలుముకుంది. ఈ హృదయవిదారక సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొంది.
మక్తల్ గ్రామీణం, న్యూస్టుడే: మరో 24 గంటల్లో పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులకు బలైంది. ఆమె ఆత్మహత్యతో పెళ్లింట విషాదం అలుముకుంది. ఈ హృదయవిదారక సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొంది. ఎస్ఐ ఎ.రాములు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ పురపాలిక పరిధిలోని చందాపూర్కు చెందిన పద్మమ్మ, వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి(19). ఆమెకు అదే పురపాలిక పరిధిలోని దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. మంగళవారం పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులకు భీమేశ్వరి ఇంట్లోని వెంటిలేటర్కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. ఆమె దగ్గర లభించిన లేఖ (సూసైట్ నోట్)లో.. తనకు నిశ్చితార్థం అయినా చందాపూర్కు చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉంది. యువకుడు వేధిస్తున్నట్లు తమతో చెబితే పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవారమని కుటుంబ సభ్యులు విలపించారు. భీమేశ్వరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.