Crime News: జగిత్యాలలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు.. కిలోల్లో బంగారం స్వాధీనం

జగిత్యాల జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఆదేశం మేరకు గురువారం అర్ధరాత్రి వరకు జిల్లావ్యాప్తంగా దాడులు

Updated : 24 Sep 2022 08:10 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఆదేశం మేరకు గురువారం అర్ధరాత్రి వరకు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించారు. మెట్‌పల్లిలో వడ్డీ వ్యాపారి కట్కం శివ ఇంట్లో 3.448 కిలోల బంగారం, రూ.32.11లక్షల నగదు, బొప్పొజి లక్ష్మణ్‌ ఇంట్లో రూ.24లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 268 ప్రామిసరీపత్రాలు, కుదువపెట్టుకున్న 34 వాహనాల రిజిస్ట్రేషన్ల పత్రాలు, 5 ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, 10 చెక్కులను గుర్తించారు.జగిత్యాలలో మూడు, కోరుట్లలో నాలుగు, రాయికల్‌, మెట్‌పల్లిలో రెండేసి ఇళ్లలో, జగిత్యాల మండలంలో ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదుచేశారు. జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ప్రకాశ్‌, రవీందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని