Hyderabad News: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ
జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. మరోవైపు విచారణ అనంతరం పోలీసులు
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. మరోవైపు విచారణ అనంతరం పోలీసులు ఐదుగురు మైనర్లను జువైనల్ హోమ్కు తరలించారు.
ఇవాళ ఉదయం ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అమ్నేషియా పబ్, కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36, 44 తదితర ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లి ఘటన ఎలా జరిగింది. ముందుగా బాలికను ఎవరు అప్రోచ్ అయ్యారు. ఎవరు అసభ్యంగా ప్రవర్తించారని అడిగి తెలుసుకున్నారు. కొన్ని కీలకమైన ఆధారాలను సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. పబ్లో జరిగిన ఘటనపై యాజమాన్యంతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న బౌన్సర్లను కూడా పోలీసులు విచారించారు. పబ్లో ఎంత సేపు ఉన్నారు? ఎప్పుడు బయటకు వెళ్లారు? ఏ కారులో బయటకు వెళ్లారు? కాన్సూ బేకరీకి ఎప్పుడు వెళ్లారు? అక్కడ ఎంతసేపు ఉన్నారు? అత్యాచారానికి ప్లాన్ చేసింది ఎవరు? తదితర విషయాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టినట్టు సమాచారం.
నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ...
సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. మధ్యాహ్న సమయంలో నిందితులకు వారి బంధువులు స్టార్ హోటల్ నుంచి బిర్యాని తీసుకొచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులకు సాధారణంగా ఇలాంటి ఏర్పాట్లు చేయరు. కొన్ని ప్రత్యేక కేసుల్లో వీవీఐపీలకు మాత్రమే ప్రత్యేక భోజన ఏర్పాట్లకు అనుమతిస్తారు. ఈకేసులో వీఐపీ నిందితులు కావడంతోనే బిర్యానీతో భోజనం ఏర్పాట్లు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యాచారం కేసులో ఉన్న నిందితులకు ఇలాంటి మర్యాదలు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ను ఈనెల 10 నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వారిని సీన్ రీకన్స్ట్రక్షన్కు తీసుకెళ్లారు. అక్కడ వారు చెప్పిన వివరాలను బట్టి మళ్లీ పీఎస్కు తీసుకెళ్లి విచారణ కొనసాగించనున్నారు. నిందితులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు విచారించారు. అనంతరం జువైనల్ హోమ్కు తరలించారు. ఇందులో ఇద్దరు మైనర్లకు రెండో రోజు విచారణ, ముగ్గురు మైనర్లకు మూడో రోజు విచారణ పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో అతని ప్రమేయం ఎంతవరకు ఉంది? మైనర్లు ఎంత వరకు సహకరించారు? మైనర్లను సాదుద్దీన్ ఎలా ప్రోత్సహించాడనే దానిపై పలు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. సాదుద్దీన్ మాలిక్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. రేపు ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి అక్కడి నుంచి చంచల్గూడ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు