Nalgonda: టిఫిన్‌ కోసం బస్‌ దిగాడు.. రూ.28లక్షలు హాంఫట్‌

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ బస్సులో భారీ చోరీ జరిగింది.

Updated : 26 Jul 2023 12:58 IST

నార్కట్‌పల్లి గ్రామీణం: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద భారీ చోరీ జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద ఆగింది. ఒడిశాలోని బరంపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి టిఫిన్‌ తినేందుకు అక్కడ దిగాడు. 

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి బస్సులోని రూ.24 లక్షలు, రూ.4 లక్షలతో వేర్వేరుగా ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ సమయంలో బస్సు సిబ్బంది సహా మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. నార్కట్‌పల్లి హోటల్‌ వద్ద గత ఏడాదిలోనూ ఇలాంటి రెండు మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని