శ్రీనగర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బఘాట్‌ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా .......

Updated : 29 Feb 2024 15:22 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బఘాట్‌ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ కాల్పుల్లో సొహైల్‌ అనే కానిస్టేబుల్‌ ఘటనా స్థలంలో మృతిచెందగా.. మహ్మద్‌ యూసుఫ్‌ అనే మరో కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం రోడ్డులో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు.. దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.

గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్‌ ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌ యజమాని కుమారుడిపై బుధవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు 24మంది దౌత్యప్రతినిధుల బృందం పర్యటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని