Hyderabad: మరో ఆత్మహత్య ఘటన.. బోరబండలో పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం

హైదరాబాద్‌లో ఇవాళ మరో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. బోరబండ పీఎస్‌ పరిధి రాజ్‌నగర్‌లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 13 Oct 2023 13:51 IST

బోరబండ: హైదరాబాద్‌లో ఇవాళ మరో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. బోరబండ పీఎస్‌ పరిధి రాజ్‌నగర్‌లో ఓ స్కూల్‌ టీచర్‌ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరి వేసుకుంది. భార్య, పిల్లల మృతిని తట్టుకోలేక భర్త కూడా పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను తల్లి జ్యోతి (31), పిల్లలు అర్జున్‌ (4), ఆదిత్య (2)గా గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో జ్యోతి టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త విజయ్‌ సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోనూ ఓ తండ్రి.. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని