Telangana: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం.. నలుగురికి తీవ్రగాయాలు

తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

Published : 03 Nov 2022 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం కన్సాన్‌ పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

మరోవైపు వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం బాచారం వంతెన సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు పెద్దేముల్ మండలం మదనంతపూర్‌ గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. ఇదే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని