Accident: గంగోత్రి నుంచి వస్తుండగా ఘోరం.. ఏడుగురు యాత్రికుల మృతి

గంగోత్రి నుంచి వస్తున్న యాత్రికుల బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. 27మందికి గాయాలయ్యాయి.

Published : 20 Aug 2023 20:11 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.. 27మందికి గాయాలయ్యాయి. 35మంది ప్రయాణికులతో బస్సు గంగోత్రి నుంచి వస్తుండగా గంగనమి వద్ద ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే.  

పాడేరు వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, వైద్య సిబ్బంది ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు చెప్పారు. సహాయక చర్యల కోసం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే  ఓ హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేసి ఉంచామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని