Crime News: అట్టిక గోల్డ్ కంపెనీలో భారీ చోరీ.. ఫిర్యాదు అందిన 2గంటల్లోనే కేసు కొలిక్కి
బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు,
విజయవాడ: బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, కేజిన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోన్న శిరికొండ జయచంద్రశేఖర్ చోరీకి పాల్పడినట్టు విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా మీడియాకు తెలిపారు. వేలి ముద్రలు, సీసీ కెమెరా దృశ్యాలు, తాళం పగలగొట్టిన విధానం ఆధారంగా చేసుకొని నిందితుడ్ని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం నగదు, ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు.
విజయవాడ కృష్ణలంకకు చెందిన జయచంద్రశేఖర్ అట్టిక బంగారం దుకాణంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. గత 45 రోజులుగా ఎక్కువ నగదు ఉన్న సమయంలో చోరీకి పాల్పడేందుకు నిందితుడు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీపీ వెల్లడించారు. నకిలీ తాళాలు ఉపయోగించి 10వ తేదీ రాత్రి 1.30గంటల సమయంలో నిందితుడు ముందస్తు పథకం ప్రకారం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా లాకరు తెరిచి అందులోని నగదు, ఆభరణాలను రెండు సంచుల్లో భద్రపరిచాడు. చోరీ అనంతరం తాళం పగలగొట్టడంతో పాటు సీసీ కెమెరాపై దుప్పటి కప్పేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో వేలిముద్రలు సీసీ కెమెరాపై నమోదయ్యాయన్నారు. చోరీ సొత్తును తన మిత్రుడి ఇంట్లో పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి యథావిధిగా విధులకు హాజరయ్యాడని చెప్పారు. అట్టిక దుకాణం యాజమాన్యం చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో నిందితుడు చంద్రశేఖర్ కూడా దుకాణంలోనే ఉన్నారని సీపీ వివరించారు. తమకు అందిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, డీసీపీ హర్షవర్దనరాజు, ఏడీసీపీలు కె.శ్రీనివాసరావు, ఖాదర్బాబు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘటనాస్థలాన్ని పరిశీలించి పూర్తి ఆధారాలు సేకరించారని వివరించారు. ఇంటి దొంగల పనేనని నిర్ధారణకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించి.. సీసీ కెమెరాలు పరిశీలించగా చంద్రశేఖర్ చోరీకి పాల్పడినట్టు నిగ్గు తేలిందన్నారు. తక్కువ సమయంలో చురుగ్గా కేసు దర్యాప్తు చేసి నిందితుడ్ని, నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని సీపీ కాంతిరాణా అభినందించారు. బంగారు దుకాణాల భద్రత విషయంలో వాటి నిర్వాహకులతో త్వరలోనే సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేస్తామని సీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ