Fire accident: ఎనిమిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

ముంబయి నగరంలోని బొరివలి ప్రాంతంలో ఎనిమిది అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

Published : 23 Oct 2023 16:00 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నగరం బొరివలి ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహావీర్ నగర్ ప్రాంతంలోని ఓ భవనంలో మొదటి అంతస్తులోని ఫ్లాట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంటలు చెలరేగి విద్యుత్ వైరింగ్‌, ఇన్‌స్టాలేషన్‌లకు వ్యాపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైనట్టు పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లను తరలించి మంటలను అదుపు చేస్తున్నారని తెలిపారు.  భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో క్షతగాత్రులను బొరివలిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని