Anakapally: నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Published : 27 Apr 2024 17:17 IST

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదులపాలెం జంక్షన్‌ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో నక్కపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను విశాఖ నగరంలోని గోపాలపట్నం వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని