Viveka Murder Case: వివేకా హత్య కేసు.. విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

Published : 16 Oct 2023 12:25 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, మిగతా నిందితులు హాజరయ్యారు. అనంతరం విచారణను న్యాయస్థానం నవంబర్‌ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను  సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు పొడిగిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని