East Godavari: అర్ధరాత్రి ఇంటికెళ్లి ప్రియుడిని చంపిన ప్రియురాలు
నాలుగేళ్ల పాటు ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ ప్రియురాలు హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
రాజమహేంద్రవరం: ప్రేమించిన ప్రియుడిని ప్రియురాలే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. నాలుగేళ్ల పాటు ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ హత్య చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు(26) గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర రాజమహేంద్రవరంలో చదువుతున్న సమయంలో నాగశేషుతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే, నాగశేషు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన యువతితో అతడికి వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని ప్రియురాలి వద్ద దాచి ఉంచాడు. ఇటీవల ప్రియురాలికి విషయం తెలియడంతో పలుమార్లు నాగశేషుతో గొడవపడింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తన స్నేహితుడు రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన శివన్నారాయణతో కలిసి బుధవారం అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది.
డాబాపై నిద్రిస్తున్న నాగశేషు వద్దకు వెళ్లి నిద్రలేపి గొడవకు దిగింది. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిపేటతో అతడిపై దాడి చేసింది. ఆమెతో పాటు వచ్చిన యువకుడు కర్రతో కొట్టాడు. కేకలు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నాగశేషును అంబులెన్స్లో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై శివనాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా