కార్పొరేట్ హంగులు.. సకల సౌకర్యాలు
బడి అంటేనే భవిష్యత్తుకు బాటలు వేసే గుడి. పిల్లలు ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే ప్రదేశం. పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవాలన్నా.. ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ హంగులతో సమకూరుతున్నాయి.
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు
ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు
దండేపల్లి, న్యూస్టుడే: బడి అంటేనే భవిష్యత్తుకు బాటలు వేసే గుడి. పిల్లలు ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే ప్రదేశం. పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవాలన్నా.. ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ హంగులతో సమకూరుతున్నాయి. ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలు.. సుశిక్షుతులైన ఉపాధ్యాయులు.. ప్రత్యేక తరగతుల నిర్వహణతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.
చేరికలే లక్ష్యంగా బడిబాట
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ.. సర్కారు బడిలో చేర్పించేందుకు ఈనెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి బాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలను వివరిస్తూ తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగిస్తున్నారు.
భవితకు బాసట
ప్రతిభ గల విద్యార్థులకు కేంద్రం జాతీయ మాధ్యమిక ప్రతిభా ఉపకార వేతనాలు అందిస్తోంది. ఎంపికైన ఒక్కో విద్యార్థికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందజేస్తున్నారు. ఇలా ఏటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందిని పరీక్ష ద్వారా ఎంపిక చేసి నాలుగేళ్లు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికి అయిదు నుంచి పదో తరగతి వరకు 9, 10 తరగతులు చదివే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తున్నారు.
ఏకరూప దుస్తులు.. మధ్యాహ్న భోజనం
ప్రతీ విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, పప్పులతో పాటు వారానికి మూడు రోజులు కోడిగుడ్డు, అందజేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వెజ్బిర్యాని, తదితర పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు.
ప్రయాణ భత్యం
దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భత్యం అందిస్తోంది. మూడు కిలో మీటర్ల కన్నా దూరం నుంచి వచ్చే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ. 6 వేలు, కిలో మీటరు కన్నా దూరం నుంచి వచ్చే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ. 3 వేల నగదు అందిస్తున్నారు.
మేథ.. ప్రతిభకు అండ
చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి చుంచు విష్ణువర్ధన్. పదోతరగతి వరకు వెల్గనూర్లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి మేథ ట్రస్టు నిర్వహించిన పరీక్షలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్లోని సీఎస్ఈ బీటెక్ కళాశాలలో చేరి ఇటీవలే చివరి సంవత్సరం పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ ఆతర్వాత బీటెక్, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్ ఇలా ఆరు సంవత్సరాల పాటు ఉచితంగా విద్యను అందిస్తారు. ఉచిత వసతి, దుస్తులు, రవాణాభత్యం సైతం అందిస్తోంది. సర్కారు బడుల్లో చదివే పేద ప్రతిభావంతులకు ఇది మంచి అవకాశం.
ప్రయోగాలతో పాఠాలు
* ప్రయోగాలతో పాఠాలు బోధించేందుకు అవసరమైన ల్యాబ్ సౌకర్యం
* అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధన
* మంచి జీపీఏ సాధిస్తే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లోనూ ఉచితంగా చదువుకోవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉమ్మడి జిల్లాలో ఏటా 200 మందికి ఉచితంగా ఇందులో చదివే అవకాశాన్ని కల్పిస్తోంది.
* ట్రిపుల్ ఐటీలో ప్రాధాన్యం.
* ఉచితంగా పాఠ్యపుస్తకాలు..ఈఏడాది నుంచి నోటు పుస్తకాలను అందజేయనున్నారు
అందుబాటులో అధునాతన వసతులు
పాఠశాలల్లో అన్ని హంగులతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు గతేడాది మన ఊరు-మన బడి ప్రారంభించారు. ఇప్పటికే మొదటి విడతగా మంజూరైన పాఠశాలల్లో పనులు పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. ప్రహరీ, తరగతి గదులు, డ్యూయెల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, డిజిటల్ బోధన వసతి తదితర అన్ని హంగులు కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి ఫలితాలు
ఎస్.యాదయ్య, జిల్లా విద్యాధికారి, మంచిర్యాల
సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఏకరూప దుస్తులు ఇలా ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. మన ఊరు-మన బడి ద్వారా కార్పొరేట్ హంగులతో ఆకర్షణీయంగా మారాయి. మంచి ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు, డిజిటల్ బోధన సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడే చేర్చితే భవిష్యత్తు బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.