దేనికైనా ఓ లెక్క ఉండాలబ్బా!
ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలంటారు. దీనినే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఓ లెక్కతో నడవాలని చెబుతారు. ఆలోచించి అడుగేయకుంటే అనర్థాలు తప్పవని స్థూలంగా ఈ మాటల మర్మం. కొందరు కొన్ని విషయాల్లో ‘అతి’ చేస్తుంటారు.
‘అతి’తో అనర్థాలు తప్పవు
మామడ, న్యూస్టుడే
ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలంటారు. దీనినే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఓ లెక్కతో నడవాలని చెబుతారు. ఆలోచించి అడుగేయకుంటే అనర్థాలు తప్పవని స్థూలంగా ఈ మాటల మర్మం. కొందరు కొన్ని విషయాల్లో ‘అతి’ చేస్తుంటారు. దీని మూలంగా వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాహన వేగంలో పరిమితి లేకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆహారం విషయంలో అదుపు లేకుంటే ఆరోగ్యానికి ప్రమాదం. నోటి మాటలు ఆధీనంలో లేకుంటే అనవసర గొడవలొస్తాయి. అంతర్జాలం..సామాజిక మాధ్యమంలో పొద్దస్తమానం మునిగి తేలితే వచ్చే ఇబ్బందులు కోకొల్లలు. పాతకాలం నుంచి అతి వద్దనే సామెతలు వాడుకలో ఉన్నాయి. ఇప్పుడూ మితం ముద్దు అనే నినాదాలు కనిపిస్తాయి. ఇలా ఎన్నో అంశాలు ‘అధికంగా’ చేయడంవల్ల ఎదురయ్యే ఇబ్బందులు..అధిగమించాల్సిన అవసరాన్ని వివరిస్తూ కథనం.
నోరు దాటని మాటకు రాజువే
ఎక్కువగా మాట్లాడితే జనాలకు వ్యంగ్య బిరుదులొస్తాయి. వాగుడుకాయ..వసపిట్ట అని పిలిపించుకోక తప్పదు. అందుకే పెద్దలు అవసరం మేరకే మాట్లాడాలని, అతిగా నోటికి పని చెప్పొద్దంటారు. ‘నోరు జారిన మాటకు నీవు బానిసవు-నోరు దాటని మాటకు నీవు రాజువు’ అని అంటారంటే మాటకున్న విలువ దానిని అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతుందో అర్థం చేసుకోవాలి. మాటలతోనే గొడవలు పెరిగిన సంఘటనలు, పోలీసు స్టేషన్ల దాకా వస్తున్న కేసులు చాలానే ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్లలో వంద కేసులు నమోదైతే అందులో సగానికి పైగా చిన్న తగాదాలే ఉంటున్నాయి.
అంతర్జాలంలో అదే పనిగా..
ఇటీవలి కాలంలో మానసిక వైద్యుల దగ్గరకు చిత్రవిచిత్రమైన కేసులు వెళ్తున్నాయి. అవన్నీ అంతర్జాలం..చరవాణి..సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక దానితో ముడిపడినవే. మా బాబుకు 15 సంవత్సరాలు. రోజూ ఫోన్ పట్టుకొని ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూనే ఉంటున్నాడు. వద్దంటే వినట్లేదు. రాత్రి 12 దాటినా పడుకోవట్లేదు. తరచూ ఫోన్ తీస్తూ చూస్తున్నాడంటూ ఆయన కొడుకు ‘అతి’ని గోడుగా చెప్పుకున్నాడు ఓ తండ్రి. అదే వైద్యుని దగ్గరకు ఇటీవల ఒక అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఫేస్బుక్లో మిత్రులతో కలిసి దిగిన ఫొటో ఒకటి పోస్టు చేసిందట. ఎవరో ఆమె గురించి సరదాగా బాగా లేవని..ముక్కు వంకర అని వ్యంగ్యంగా వాఖ్యలు పోస్టు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయడంతో మానసిక వైద్యుడి దగ్గరకు కౌన్సెలింగ్కు వెళ్లారు.
అతి వేగం ప్రమాదకరం..
రోజూ ఎన్నోచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రధాన కారణం అదుపులో లేని వేగమే.. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమూ ఇందుకు కారణమే. ప్రతి ప్రమాదం తర్వాత విచారణలో మితిమీరిన వేగమేనన్నది రవాణా అధికారుల నివేదికలో తేలుతోంది. 2023 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1606 ప్రమాదాలు జరిగాయి. అందులో 286 మంది ప్రాణాలు కోల్పోయారు. 750 మంది వరకు అవయవాలు దెబ్బతిన్న వారున్నారు. యువత బైక్ రేసింగ్ మోజులో వేగాన్ని అదుపులో పెట్టుకునే విచక్షణ కోల్పోయి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.
తిండితోనూ తిప్పలే
చాలా మంది బయటి తిండికి ప్రాధాన్యమిస్తున్నారు. కల్తీ పదార్థాల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో జిహ్వను అదుపు చేసుకోకుంటే అనారోగ్యానికి ద్వారం తెరిచినట్లే. పరిమితికి మించి తిన్నా..ఎక్కడ పడితే అక్కడ నాలుకకు రుచి చూపించినా ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. బయటి ఆహార పదార్థాల్లో రంగుల వాడకం, హానికర వస్తువుల వినియోగం ఎక్కువైంది. గతంలో నిర్మల్లో కల్తీ నూనె రాకెట్ బయటకొచ్చింది. ఆహార నియమనిబంధలను పాటించకుండా ఊబకాయం సమస్యతో సతమతమవుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో తక్కువేం లేదు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలల్లోని ‘బరువు తగ్గాలా’ అని బోర్డులు పెట్టుకున్న దుకాణాల వద్ద రోజుకు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. వీరికి నిర్వాహకులు.. నిపుణులు చెబుతున్న ప్రధానమైన సూచన తిండి (పరిమితి) నియమాలే. అది ముందుగా ఎవరికి వారే అదుపులో పెట్టుకుంటే ఊపిరి పీల్చుకునేందుకు అవస్థా ఉండదు. ఆసుపత్రుల వెంటా తిరగాల్సిన అవసరమూ రాదు.
ఆలోచించండి..అదుపులో ఉండండి
రహదారిపై ప్రయాణం చేస్తుంటే అక్కడక్కడా speed thrills but kills అన్న బోర్డులు కనిపిస్తాయి. వాటిని చూసైనా ప్రాణం మీద పట్టింపుతో వేగాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి.
అదుపులో లేకుంటే ఇబ్బందులే
ఆచార్య డా.ఏ.విశాల్, నరాల, మానసిక వైద్య నిపుణుడు
ఇంతకు ముందు రోగాల నిర్ధారణకు సంబంధించి వైద్యుల పుస్తకాల్లో పలు వ్యాధుల గురించి ఉండేవి. ఈ మధ్య కాలంలో కొత్తగా ‘ఇంటర్నెట్ అడిక్షన్ సిండ్రోమ్’ అనే కొత్త జబ్బుల గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. అంటే అతిగా అంతర్జాలం వినియోగిస్తూ క్రమంగా దానిని వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇదే కోవలోకి సామాజిక మాధ్యమాల్లో పొద్దస్తమానం తలమునకలవుతున్న వారు వస్తారు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నందున మానసికంగా, శారీరకంగా తెలియకుండానే అలసి పోతుంటారు. నరాల సమస్య వస్తుంది. అశ్లీల వీడియోలు, చిత్రాలు చూస్తూ తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలతో మా దగ్గరికి రోజుకు కనీసం అయిదారుగురు వస్తున్నారంటే మన దగ్గరా అంతర్జాలం అతి ఎక్కువే అయింది. అత్యవసరమైతే తప్ప దాంతో కాలక్షేపం చేయొద్దు. పరిమితంగా అవసరం మేరకే దేనినైనా ఉపయోగిస్తే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో త్రిపుల్ తలాక్ మొదటి కేసు అదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం నమోదైంది. -
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు