logo

ఆదిలాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి నగేష్‌పై కోడ్‌ ఉల్లంఘన కేసు

అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఆ లోక్‌సభ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌పై ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.

Published : 19 Apr 2024 21:36 IST

ఏదులాపురం: అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఆ లోక్‌సభ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌పై ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఫ్లెక్సీలపై శ్రీరాముడి చిత్రంతోపాటు ఎమ్మెల్యే శంకర్ ఫోటోను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ముద్రించారని విఎస్టీ అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాద్రే ఆయన పై కేసు నమోదైంది. కాగా, శ్రీరామనవమి రోజున శోభాయాత్రలో పాల్గొన్న పాయల శంకర్, గోడం నగేష్ నినాదాలు చేశారని వీఎస్టీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వారిద్దరిపై శుక్రవారం కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని