రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
ఈనాడు, ఆసిఫాబాద్: పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ తతంగమంతా ఆడిట్లో గుర్తిస్తున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా పంచాయతీల్లో రూ.కోట్ల ఖర్చుకు లెక్కలు లేవని తేలుస్తున్నారు. అయినా కఠిన చర్యలు తీసుకోకపోవడం, సొమ్ములను రికవరీ చేయకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఇదే తీరున మార్కెట్ కమిటీల్లోనూ, పురపాలికల్లోనూ నిధుల గోల్మాల్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పథకాలపై తీవ్ర ప్రభావం పడటంతో మౌలిక వసతులు కొరవడుతున్నాయి.
పంచాయతీలు, పురపాలిక, మార్కెట్ కమిటీల్లో ఏటా ఆడిట్ అధికారులు వచ్చిన నిధులు, చేపట్టిన పనులు, అందుకు తగిన రశీదులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తారు. జరిగిన అవకతవకలను గుర్తిస్తారు. వీటిని నెల నుంచి మూడు నెలల వరకు పరిష్కరించుకోవాలని అధికారులు సంబంధిత శాఖకు నోటీసులు అందజేస్తారు. ప్రస్తుతం కేవలం నోటీసులు ఇవ్వడం వరకే ఆడిట్ అధికారులు పరిమితమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 335 పంచాయతీలు ఉండగా 2005 నుంచి 2020 వరకు 35,488 అభ్యంతరాలను అధికారులు గుర్తించారు. ఈ పనుల విలువ రూ.8.05 కోట్లు. వీటిపై ఇంకా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
లెక్కల్లో చిక్కులు..
2021-22 ఆర్థిక సంవత్సరానికి 3,043 అభ్యంతరాలు గుర్తించగా రూ.5 కోట్ల పనులకు సంబంధించి లెక్కలు లేవని అధికారులు గుర్తించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ ప్రక్రియ తుది దశకు చేరుకొంది. 2021-22 సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో గుర్తించిన ఆడిట్ అభ్యంతరాల విలువ రూ.5.14 కోట్ల వరకు ఉంది. ఒక్కో మండలంలో రూ.19 లక్షల నుంచి రూ.49 లక్షల వరకు అంటే వెచ్చించిన నిధులకు సంబంధించి లెక్కలు లేవు. ఇందులో ఆసిఫాబాద్ మండలంలోని పంచాయతీల్లో రూ.49.06 లక్షలు, చింతలమానేపల్లి, రూ.49 లక్షలు, కౌటాల రూ.48 లక్షల చొప్పున ఖర్చు చేసిన వాటికి సరైన ఆధారాలు లేవని తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
పురపాలికలోనూ అదే తీరు
కాగజ్నగర్ పురపాలికలో 2019-20 సంవత్సరంలో రూ.12.3 లక్షలు, 2020-21లో రూ.3.46 కోట్ల విలువైన పనులకు సంబంధించి సరైన రశీదులు లేవు. 2005 నుంచి 2019 వరకు రూ.17 కోట్ల పనులకు సంబంధించి పురపాలికలో అధికారులు ఆడిట్ అభ్యంతరాలు గుర్తించారు. పురపాలక ఆదాయ, వ్యయాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్లు లేకపోవడం, విడుదలైన నిధులను ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిబంధనల మేరకు ఖర్చు చేయకపోవడం, ట్రేడ్ లైసెన్స్ రుసుముల వసూళ్లలో నిర్లక్ష్యం, టెండర్ లేకుండానే పనులను నచ్చిన వారికి అప్పగించడం, చేసిన పైప్లైన్ పనులకు సంబంధించి బిల్లులు లేకపోవడం తదితర పనులు పురపాలికలో చోటుచేసుకున్న అక్రమాలను అధికారులను గుర్తించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ పురపాలికలో 28 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు. వీటి విలువ రూ.10.16 లక్షలుగా తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్ల ప్రయాణం.. కాకూడదు ప్రమాదకరం
[ 03-05-2024]
ఒకప్పుడు కారంటే విలాసవంతమైన జీవితానికి ప్రతీక. ఇప్పుడు నిత్యావసర వినియోగమైపోయింది. ఉన్నత వర్గాలు మొదలుకొని సామాన్యుల వరకు కార్ల వినియోగం సాధారణమైంది. -
అసలేం జరుగుతోంది..
[ 03-05-2024]
గతంలో అల్లర్ల కారణంగా సున్నిత ప్రాంతంగా పేరొందిన భైంసా.. ఆ ముద్రను ఇప్పుడిప్పుడే చెరిపేసుకుంటోంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కృషితో మరక చెరిగిపోతుండగా కొత్తగా ఆర్థిక నేరాలు, గంజాయి విక్రయాలు, ఆన్లైన్ బెట్టింగ్, మట్కా, జూదం వంటి దందాలు చెడ్డపేరు తెస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
మాది సంక్షేమం.. వారిది సంక్షోభం
[ 03-05-2024]
‘ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో నాకు అవినాభావ సంబంధం ఉంది. సీఎం అయ్యాక మూడు సార్లు ఇక్కడికి వచ్చాను. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓటర్లు ఎటు మొగ్గితే ఆ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. -
ఓటమి భయంతో కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు
[ 03-05-2024]
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఓటమి భయంతో కాంగ్రెస్, భాజపా పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. -
ముందస్తు పన్ను వసూళ్లు రూ. 2.13 కోట్లు
[ 03-05-2024]
బల్దియాలో ముందస్తు ఆస్తిపన్ను వసూళ్లకు స్పందన లభించింది. ఆస్తి పన్నులు ముందుగా చెల్లించేవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆరు నెలల్లోగా బకాయిలు చెల్లిస్తాం
[ 03-05-2024]
జిల్లాలో పదేళ్ల కిందట ఫిక్స్డ్ డిపాజిట్లు, హోటల్ వ్యాపారం, ప్లాట్ల విక్రయం వంటి లావాదేవీలు కొనసాగించి గొలుసుకట్టు వ్యాపారంతో డిపాజిట్లు సేకరించిన యూనిక్ మార్కంటైల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ఎట్టకేలకు బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. -
సమస్యలపై స్పందించాలి.. పరిష్కారాలు పట్టాలెక్కాలి..
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వేపరంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారంతో పాటు మరిన్ని రైళ్లు ఆపాల్సిన అవసరముంది. గత కొంతకాలంగా ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు సమస్యలను రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించినా పూర్తిస్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. -
వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు
[ 03-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఆ అవకాశం వినియోగించుకునేలా.. పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం కిందటి శాసనసభ ఎన్నికల్లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. -
భాజపా, కాంగ్రెస్ అంతర్గత ఒప్పందం
[ 03-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్ ఆరోపించారు. -
అస్తవ్యస్తంగా.. భగీరథ!
[ 03-05-2024]
మిషన్ భగీరథ పథకం.. ఆచరణలో అలసత్వం కారణంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తీరడం లేదు. చేపట్టిన పనులన్నీ అస్తవ్యస్తంగా ఉండటం, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో.. తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పరిహారంపై ఆశలు..
[ 03-05-2024]
దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రతీలాల్ నాయక్ ఈయన గ్రామ శివారులోని ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కంకి చేతికొచ్చే దశలో వడగళ్ల వానతో పంట నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. -
కాంగ్రెస్ చేరికల జోరు..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు భారాసలో పనిచేసిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన బడా నాయకులు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. -
ఎండ.. ప్రచండ..
[ 03-05-2024]
గతంలో ఎన్నడూలేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 6 గంటలకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.