ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం.
మీట నొక్కడమే కాదు.. ఓటెవరికి పడిందో నిర్ధారించుకోవచ్చు
పోలింగ్ ప్రక్రియపై అవగాహనతో అనుమానాల నివృత్తి
‘ఈనాడు’ విజ్ఞప్తి మేరకు డెమో ఏర్పాటు చేసిన
ఎన్నికల సంఘం అధికారులు
ఈనాడు, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. ఐదేళ్లపాటు తన ప్రతినిధిగా కొనసాగే నేతను ఎన్నుకునేందుకు వేసే ఓటుపై ఓటరుకు ఎలాంటి సందేహం ఉండొద్దు. పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిల్చొని.. కేంద్రం లోనికి వెళ్లాక ఈవీఎంపై ఉన్న ఏదో ఒక మీట నొక్కి వచ్చేస్తే సరిపోదు. తాను వేసిన ఓటు.. తాను వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న అనుమానానికి తావు లేకుండా.. నిర్ధారించుకోవడం అవసరం. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో జవాబుదారీ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకునేందుకు వీలుగా ఓటింగ్ చీటీ(వీవీ ప్యాట్)ని ప్రదర్శిస్తోంది. అయితే, ఇటీవల కర్ణాటకలో జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియపై ఓ ఓటరు అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకమని.. దీనిపై అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు ఛైతన్యం కల్పించేందుకు డెమో(నమూనా) ప్రదర్శించాలని ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను ‘ఈనాడు’ కోరింది. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కేంద్రంలో అధికారులు నమూనా(మాక్) పోలింగ్ విధానాన్ని ప్రదర్శించారు. ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి.. ఓటర్లు తాము వేసిన ఓటును ఎలా పరిశీలించుకోవచ్చో వివరించారు.
ఓటరు చీటీ, గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక.. మొదట పోలింగ్ అధికారి-1 వద్దకు వెళ్లాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో పరిశీలిస్తారు. ఓటరు పేరు, జాబితాలో వరుస సంఖ్యను గట్టిగా చదువుతారు.
ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నంబరును తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలో సరిచూసుకుంటారు.
అక్కడి నుంచి పోలింగ్ అధికారి-2 వద్దకు ఓటరు వెళ్లాలి. అతని వద్ద ఉన్న చీటీలోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్లో సరిచూసుకుని.. సంతకం తీసుకుంటారు. ఓటరు నిరక్షరాస్యులైతే వేలిముద్ర తీసుకుంటారు. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు.
అసెంబ్లీ, లోక్సభ స్థానాలు రెండింటికీ ఎన్నికలు జరిగేచోట ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేర్వేరు రంగుల చీటీలు ఇస్తారు. వాటి ఆధారంగా రెండు బ్యాలెట్ యూనిట్లలో వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఓటింగ్ ప్రక్రియ ఇలా..
అనంతరం ఓటరు పోలింగ్ అధికారి-3 వద్దకు వెళ్లాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలిస్తారు. తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్లో మీట నొక్కి.. ఓటును రిలీజ్ చేస్తారు. (ఓటు రిలీజ్ చేయకముందు కంట్రోల్ యూనిట్పై ఎడమవైపు ఆకుపచ్చ రంగు ఎల్ఈడీ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఓటు రిలీజ్ చేశాక కుడివైపు ఎరుపు రంగు లైట్ వెలుగుతుంది. దీన్ని ఓటరు గమనించవచ్చు.)
లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
ఆ తరువాత బ్యాలెట్ యూనిట్ వద్దకు ఓటరు వెళ్లాలి. ఈ యూనిట్ పైభాగంలో ఆకుపచ్చని ఎల్ఈడీ లైట్ వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్పై అతికించిన బ్యాలెట్ పత్రంపై తాను ఓటేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటను నొక్కాల్సి ఉంటుంది. మీటను నొక్కగానే.. దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైటు వెలుగుతుంది. బీప్ శబ్దం వస్తుంది. బ్యాలెట్ యూనిట్పై ఉన్న ఆకుపచ్చ రంగు లైటు ఆరిపోతుంది. బ్యాలెట్ యూనిట్పై సమీపంలోనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో ఒక చీటీ కనిపిస్తుంది. అందులో ఓటరు ఓటు వేసిన పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు కనిపిస్తాయి. ఈ చీటీ ఏడు క్షణాలపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బాలో పడిపోతుంది. దాన్ని పరిశీలించి.. తాను వేసిన ఓటు సరిగ్గా పోలైందా, లేదా అన్నది ఓటరు నిర్ధారించుకోవచ్చు.
లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేరువేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.
పోలింగ్ సమయం ముగిశాక కంట్రోల్ యూనిట్పై ఉన్న క్లోజ్ అనే మీటను అధికారులు నొక్కుతారు. వెంటనే పడిన ఓట్లు, అభ్యర్థుల సంఖ్య యూనిట్పై ఉన్న స్క్రీన్లో కనిపిస్తాయి. పోలింగ్ క్లోజ్ అని కూడా కనిపిస్తుంది. అనంతరం పోలింగ్ బూత్ ఏజెంట్ల సమక్షంలో ఆ యూనిట్కు సీల్ వేస్తారు. దాన్ని ఓ బాక్సులో పెట్టి.. దానికీ సీల్ వేస్తారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులు, బూత్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఈ కంట్రోల్ యూనిట్లను, వీవీ ప్యాట్ యంత్రాలను కౌంటింగ్ చేపట్టేవరకు భద్రపరుస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత