నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది.
నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం
న్యూస్టుడే, ఇంద్రవెల్లి : జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 13 మంది అమరులయ్యారు. అడవి బిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల జ్ఞాపకార్థం స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. కొన్నేళ్ల పాటు స్తూపం వద్ద ఏప్రిల్ 20న ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పించలేని పరిస్థితి. పోలీసుల బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2005లో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీల ప్రజాప్రతినిధిగా బోథ్ ఎమ్మెల్యేగా సోయం బాపురావు(తెరాస) నుంచి విజయం సాధించిన రోజున అర్ధరాత్రి గిరిజన అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా గిరిజనులు 25వ తేదీన నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పలు ఆంక్షలతో అనుమతి ఇవ్వడంతోపాటు 50 మందితో నివాళులర్పించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా జిల్లా పాలనాధికారులు, ఎస్పీలు కేవలం రెండు, మూడు గంటల సమయం మాత్రమే కేటాయించారు. ఆ సమయంలో ఆదివాసీలు స్వేచ్ఛా వాతావరణంలో ఆదివాసీల సంప్రదాయ పూజలు నిర్వహించి అమరులకు నివాళులర్పించారు.
32 ఏళ్లు నిర్బంధం
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంపై ఉమ్మడి రాష్ట్రంలో 32 ఏళ్లు నిర్బంధం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజనులకు నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చారు. 1987లో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు సభను నిర్వహించారు. ఈ సభకు ప్రజా గాయకుడు గద్దర్, జార్జి ఫెర్నాండేజ్లు హాజరయ్యారు. తర్వాత అమరులకు నివాళులర్పించుటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులను రంగంలోకి దించి ప్రతి పల్లెలను జల్లెడ పట్టేవారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే గిరిజనులు తమ వివాహాలను సైతం వాయిదా వేసి మే నేలలో నిర్వహించేవారు. ఈ ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకిరాగానే గిరిజన గ్రామాల్లో స్వేచ్ఛగా వివాహాలు జరుపుతున్నారు.
బాధిత కుటుంబాలకు ఓదార్పు..
అనాటి పోలీసు కాల్పులలో అమరులైన కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంజూరు చేశారు. అమరుల కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రుణాలను సైతం మంజూరు చేస్తామని అమరుల కుటుంబాలకు హామీ ఇచ్చారు. చాలా మంది బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని పలువురు ఆదివాసీలు పేర్కొంటున్నారు.
మమ్మల్ని గుర్తించలేదు :
మడావి జంగుబాయి, కన్నాపూర్, సిరికొండ మండలం
1981 ఏప్రిల్ 20న మా మామ మడావి రాము, భర్త మడావి శంభులతో కలిసి ఇంద్రవెల్లి వెళ్లాను. మామ రాము పోలీసు కాల్పులకు మరణించాడు. భర్త శంభుతో పాటు నాకు పోలీసు తూటలు తగిలి చేతులకు గాయాలయ్యాయి. భర్త శంభు పోలీసు తూటాల గాయంతో మరణించాడు. నేటికీ నాకు ఎలాంటి సాయం అందలేదు. కనీసం పింఛను సైతం ఇవ్వడం లేదు. కన్నాపూర్లో 6.19 గుంటల సాగు భూమి ఉంది. గతంలో రూ.200 పింఛను వచ్చేది. పదేళ్ల నుంచి రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేసినా నాకు అందలేదు.
గాయాలతో నా భర్త చనిపోయాడు..
కినక జైతు బాయి, కన్నాపూర్, సిరికొడ మండలం
నా భర్త కినక రాజు వార సంతకు వెళ్లి పోలీసు కాల్పులకు గురయ్యారు. గాయాలతో ఇంటికి వచ్చిన భర్తకు చెట్ల మందులతో రక్తం రాకుండా కట్టు కట్టుకున్నాం. తీవ్ర గాయాలతో నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లలను పోషిస్తూ పెద్ద చేశాను. ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి సహాయం అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు సైతం మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేసి మాకు న్యాయం చేయాలి.
వంద మంది పోలీసులతో బందోబస్తు
ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఉట్నూరు డీఎస్పీ నాగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపారు. బందోబస్తులో ఇద్దరు సీఐలు, 7 మంది ఎస్సైలతోపాటు ఇతర పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు షాహిద్ అహ్మద్ ... -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్