logo

వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు

గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి.

Published : 30 Apr 2024 13:03 IST

ఎదులాపురం: గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జైనూరు మండలంలోని పొలాస గ్రామంలో వివాహ వేడుకల్లో పాల్గొని మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్న వ్యాను అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారందరూ గాయాల పాలయ్యారు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని