logo

‘రూ.కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు’

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి రూ.కోట్లు ఇచ్చి తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు.

Published : 01 May 2024 02:36 IST

 

అమరవాది గ్రామంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి రూ.కోట్లు ఇచ్చి తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని మంగళవారం పట్టణంలో ప్రచారం చేశారు. అమరవాది గ్రామంలోని అయిదో వార్డులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు.  భారాస హయాంలో పట్టణంలో జీఓ నంబరు 76 ద్వారా 4,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని, కాంగ్రెస్‌ హయాంలో ఏ ఒక్కరికైనా పట్టా అందజేశారా అని ప్రశ్నించారు.  గాండ్ల సమ్మయ్య, రాజారమేష్‌, సుదర్శన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని