కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.
విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబీకులు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు
ఆదిలాబాద్ అర్బన్, న్యూస్టుడే : విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. శనివారం రిమ్స్ శవాగారం నుంచి మృతదేహాన్ని విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి నినాదాలు చేశారు. తమను పోషించాల్సిన ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు బుచ్చయ్య, లక్ష్మి దంపతులు, సోదరి కోమల రోధించారు. వారికి మద్దతుగా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు చేరుకున్నారు. రూ.50లక్షల నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టూటౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అటు కుటుంబీకులతో, అధికారులు, లైన్మెన్ల సంఘం నాయకులతో మాట్లాడారు. చివరకు లైన్మెన్ సంటెన్న రూ.3 లక్షలు, ఆదిలాబాద్ డివిజన్ కార్మికులు రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. శాఖాపరంగా రావాల్సిన నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ప్రతిపాదనలు పంపుతామని అధికారులు ఒప్పుకోవడంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు అంజయ్ కుమార్, వెంకటేష్, రామ్కుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్, మురళీ, అఖిల్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హనుమాన్ ఆలయంలో హుండీ చోరీ
[ 21-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీ సమీపంలో గల ఆదర్శ్ నగర్ హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి సమయంలో ఆగంతకుడు చొరబడి హుండీలోని నగదు చోరీ చేశాడు. -
సాధారణ బోగీల పెంపు కోసం ఉత్తరాల ఉద్యమం
[ 21-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు ఐదుకు పెంచాలంటూ 'ఐదు సాధారణ భోగీల సాధన సమితి' ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. -
పీసీ పీఎన్డీటీ బృందం ఏర్పాటు
[ 21-05-2024]
ప్రైవేట్ ఆసుపత్రుల్లో భ్రూణ, లింగ నిర్ధారణ చేయకుండా అడ్డుకట్ట వేయటానికి పీసీ పీఎన్డీటీ చట్టం 1994 ను పగడ్బందీగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. -
బుధవారం శ్రీనివాస స్వామి కళ్యాణం
[ 21-05-2024]
జిల్లా కేంద్రం మంగ మఠంలోని శ్రీ రమా సత్యనారాయణ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. -
ఘనంగా రాజీవ్ వర్ధంతి
[ 21-05-2024]
పట్టణంలోని ప్రజా సేవాభవన్లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 21-05-2024]
రైతులు కోరిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తత్రి డిమాండ్ చేశారు. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్