logo

జొన్న పంట దగ్ధం

అదిలాబాద్ జిల్లా తాంసి మండలం పున్నాగ గ్రామానికి చెందిన గట్టు గంగయ్య జొన్న పంట దగ్ధమైంది.

Published : 02 May 2024 18:50 IST

తాంసి: అదిలాబాద్ జిల్లా తాంసి మండలం పున్నాగ గ్రామానికి చెందిన గట్టు గంగయ్య జొన్న పంట దగ్ధమైంది. యాసంగిలో ఏడెకరాల్లో సాగు చేసిన జొన్న పంట కోతకు రాగా బుధవారం 5 ఎకరాల్లో పంటను హార్వెస్టర్ సాయంతో పట్టించాడు. మిగతా రెండు ఎకరాల్లో పట్టించే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలోని చెత్తకు నిప్పు పెట్టాడు. ఈదురుగాలులకు  మంటలు వ్యాపించి, జొన్న చేనుకు అంటుకున్నాయి. జొన్న కంకులు కాలిపోవడంతో సుమారుగా 50వేల వరకు నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదక సిబ్బంది మంటలను ఆర్పేయడంతో మిగతా రైతుల పంటలకు ఎలాంటి నష్టం జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని