logo

హామీలను విస్మరించి భాజపా పాలన

ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్‌) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్‌ అన్నారు.

Published : 04 May 2024 06:12 IST

మాట్లాడుతున్న టీఎస్‌డీఎఫ్‌ సమన్వయకర్త ఆకునూరి మురళి

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్‌) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్‌ అన్నారు. టీఎస్‌డీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జాగో (మేలుకో) బస్సు యాత్ర నిర్మల్‌కు శుక్రవారం చేరుకుంది. స్థానిక అంబేడ్కర్‌చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశ సంపదను భాజపా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న భాజపాకు పార్లమెంటు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, పద్మజా, రాజన్న, ఎస్‌.ఎన్‌.రెడ్డి, శంకర్‌, రాయదాస్‌, నందిరామయ్య, లక్ష్మి, రామలక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని