ఇంటర్లో అందలం.. పదిలో అధమం
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది.
ఇంత తేడా ఎందుకో.?
న్యూస్టుడే, ఆసిఫాబాద్ అర్బన్
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో పదో తరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థులే తదుపరి రెండేళ్లలో ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ తేడాకు కారణమేమిటనే ప్రశ్న విద్యానిపుణులను తొలుస్తోంది. ఏడాది, రెండేళ్లలోనే ఆ విద్యార్థుల్లో అంత పరిణతా? సెలబస్ సులభమా?, పరీక్షల్లో నిర్వాహణలో అనుకూలతలా? తదితర విషయాలపై కనుగొనాల్సి ఉంది.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈసారి పదో తరగతి ఫలితాల్లో దాదాపు 8శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 75.63శాతం ఉత్తీర్ణతతో 29వ స్థానంలో నిలిస్తే తాజాగా ఉత్తీర్ణత శాతం 83.29కి పెరిగింది. అయినా మిగతా జిల్లాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానానికి పరిమితమైంది. ఇంటర్కు వచ్చే సరికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఫలితాల్లో రాష్ట్రంలో 7లోపు ర్యాంకుల్లో ఉంటోంది.
ఫలితాలపై విశ్లేషణ
పదో తరగతి ఫలితాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసింది. ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రధానోపాధ్యాయులతో వరుస సమీక్షలు జరిపారు. గడిచిన విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు, బదిలీలు, పదోన్నతుల తతంగం సుమారు నెలపాటు బోధనపై ప్రభావం చూపింది. శిక్షణలు, సెలవులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ డిసెంబరులోగానే పదో తరగతి సిలబస్ పూర్తి చేయించి వెంటనే పునఃశ్చరణ తరగతులకు రోజువారీ ప్రణాళికలను అమలు పరిచారు. వెనుకబడిన విద్యార్థుల దత్తత, హాజరు శాతం పెంచేందుకు శ్రద్ధ తీసుకొన్నారు. నిపుణులతో సందేహాలు తీర్చడం, ప్రేరణ తరగతులు నిర్వహించడం ద్వారా సిద్ధం చేశారు. అయినా తుది ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడానికి విద్యార్థుల గైర్హాజరు ప్రధాన కారణంగా ఉపాధ్యాయులు చూపుతున్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల మాతృభాషలు వేరుగా ఉండటం, కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పోషకుల్లో పిల్లల చదువుల పట్ల ఆసక్తి లేకపోవడం, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడటం తుది ఫలితాలను దెబ్బతీస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
ఆ రెండింటిలోనే తప్పారు..
విద్యార్థులు ప్రధానంగా సైన్సు, గణితం పేపర్లలో ఎక్కువ మంది ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు కొంత కఠినంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు నిత్యం తరగతులకు హాజరై ఉంటే ఫలితాలు బాగుండేవని సంబంధిత ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల కొరత కూడా ఓ కారణమేనని చెబుతున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడం, కాపీయింగ్కు అవకాశాలు లేకపోవడం ఫలితాలు పడిపోవడానికి కారణాలని పోషకులు పేర్కొంటున్నారు. పది ఉత్తీర్ణులై ఇంటర్కు వెళ్లారంటే ఎంతో కొంత విద్యార్థిలో విషయంపై అవగాహన పెరుగుతుందని, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ విద్యలోనూ బోధన ప్రణాళికలు మెరుగైన ఫలితాలకు కారణంగా సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. ఇంటర్లో మెరుగైన పలితాలు వచ్చినట్లే పదో తరగతిలోనూ రావడానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోషకులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..