logo

జిల్లా కేంద్రానికి చేరుకున్న ఓటర్ల చైతన్య యాత్ర

విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి భాజపా  వ్యతిరేకం అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళీ ...

Published : 04 May 2024 09:49 IST

ఎదులాపురం: విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి భాజపా  వ్యతిరేకం అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళీ ఆరోపించారు. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల చైతన్య యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక నేతాజీ చౌక్, కూలీల అడ్డా వద్ద ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగాన్ని, హక్కులను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని