logo

డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి

తీవ్రమైన ఎండల దృష్ట్యా ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న కాకతీయ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు.

Updated : 04 May 2024 16:55 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: తీవ్రమైన ఎండల దృష్ట్యా ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న కాకతీయ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదిలాబాద్ పట్టణంలోని కుమరంభీం భవన్‌లో సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినా కూడా యూనివర్సిటీ వారు పరీక్షలు నిర్వహించడం ఏంటని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎర్రజి హరీష్, సహాయ కార్యదర్శి కె.దత్తత్రీ, జిల్లా నాయకులు శ్రీకర్, ప్రతమేశ్, లింగు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని